సైదాబాద్ చిన్నారి అత్యాచారంపై స్పందించిన నాని.. వాడు బయట ఉండకూడదంటూ…

సైదాబాద్ చిన్నారి అత్యాచార ఘటన యావత్ రెండు తెలుగు రాష్ట్రాలను ఎంతో కృంగ తీసింది. అభం శుభం తెలియని ఆ చిన్నారిని పట్ల అంత దారుణానికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీల వరకు స్పందించారు. ముక్కుపచ్చలారని ఆ పసిబిడ్డను అంత దారుణంగా అత్యాచారం చేసి చంపిన ఆ నిందితుడిని ఈ భూమిపై ఉండకూడదని అతనిని ని కఠినంగా శిక్షించాలని పెద్దఎత్తున డిమాండ్ చేస్తున్నారు.

ఈ క్రమంలోనే ఈ ఘటనపై సినీ సెలబ్రిటీలు మంచు మనోజ్ ఈ విషయంపై స్పందించి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిందితులకు కఠినంగా శిక్షపడేలాని తన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అదేవిధంగా మీడియాను ఉద్దేశించి మీడియా ఇలాంటి వారి పట్ల ఫోకస్ చేసి, చిన్నారికి న్యాయం జరిగేలా చూడమని తెలిపారు. అదే విధంగా ఈ చిన్నారి ఘటనపై సూపర్ స్టార్ మహేష్ బాబు స్పందిస్తూ ఇంతగా దిగజారిపోయిన సమాజంలో మనం బ్రతుకుతున్నాం.. ఈ సమాజంలో మన బిడ్డలు ఎలా బతకాలి అంటూ స్పందించారు.

ఈ క్రమంలోనే రెండు రాష్ట్రాలు నిందితుడు రాజు పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడు. అతని ఆచూకీ తెలిపిన వారికి పది లక్షల నగదును పోలీసులు ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే చిన్నారి ఘటనపై నేచురల్ స్టార్ నాని స్పందించారు. ఈ సందర్భంగా నాని స్పందిస్తూ బయటేక్కడో ఉన్నాడు.. ఉండకూడదు అంటూ సింపుల్ గా తన వైల్డ్ రియాక్షన్ చూపించారు.

అదే విధంగా దర్శకుడు ఈ ఘటన పై స్పందిస్తూ నిందితుడు బయట తిరుగుతున్నాడు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండండి..అతని ఆచూకీ తెలిసినవారు పోలీసులకు సమాచారం ఇవ్వండి అంటూ ప్రతి ఒక్కరు ఈ చిన్నారి అత్యాచార ఘటన పై స్పందిస్తూ నిందితులకు శిక్ష పడాలని డిమాండ్ చేస్తున్నారు.