ఢిల్లీలోని శాస్త్రి నగర్లో తుపాకీతో తనను కొందరు దుండగులు బెదిరించి దాదాపు రూ.7 లక్షల వరకు దోచుకున్నట్లు బాలీవుడ్ నటి నిఖిత రావల్ చెప్పుకొచ్చారు. ఆ భయంకరమైన ఘటన గురించి ఆమె మాట్లాడారు. అప్పటి నుంచి ఢిల్లీలో ఏ పని చేయాలన్నా భయంగా ఉందంటూ చెప్పుకొచ్చారు. ఈ భయానక సంఘటనను గుర్తుచేసుకుంటూ నిఖిత ఏం మాట్లాడారంటే.. ఎంగేజ్మెంట్ పార్టీలో అతిథి పాత్ర కోసం ఢిల్లీకి వచ్చానని చెప్పారు.
ఆమెతో పాటు ఆమె చెల్లెలు కూడా ఉన్నారు. రాత్రి 10 గంటల సమయంలో వారు ఈవెంట్ నుండి శాస్త్రి నగర్లోని తన అత్త ఇంటికి తిరిగి వస్తుండగా.. ఆమెకు ఎదురుగా ఓ కారు వచ్చి ఆగిందని.. అందులో నుంచి కొందరు ముఖాలకు మాస్కులు ధరించి.. కోతి టోపీలు పెట్టుకొని కొందరు కారు నుంచి దిగారన్నారు. తర్వాత వెంటనే తన వద్దకు వచ్చి ఒకడు తుపాకీ తీసి.. మరొకరు కత్తి తీసి.. తన వద్ద డబ్బులను ఇవ్వమని బెదిరించారన్నారు. అంతే కాకుండా తనను దుర్భాషలాడుతూ.. బెదిరించి పర్సు, డబ్బులు, డైమండ్ రింగు మరియు చెవి కమ్మలను దోచుకెళ్లినట్లు చెప్పారు.
ఆమెతో పాటు తన చెల్లి కూడా ఉందంటూ చెప్పుకొచ్చారు. వాళ్లు తనను బెదిరిస్తున్న సమయంలో నిర్భయ ఘటన ఆమె మనస్సులోకి వచ్చినట్లు చెప్పింది. వాళ్లు వెళ్లిపోగానే వెంటనే హుటాహుటిన తన అత్త ఇంటికి చేరుకోగా.. 10 నిమిషాల వరకు అదే ఘటనను గుర్తు చేసుకుంటూ ఎంతో భయటపడి పోయానని చెప్పారు. తర్వాత ఆమె ఆ షాక్ నుంచి తేరుకోగానే వెంటనే తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పారట.
తర్వాత వెంటనే ఒక్క క్షణం కూడా ఢిల్లీలో ఉండకూడదని నిర్ణయించుకున్నారట. ఆ సమయంలో తనను తుపాకీతో కాల్చినా.. రేప్ చేసినా తన పరిస్థితి ఏంటని తలచుకొని.. ఆ చేదు అనుభవాన్ని ఇంకా మర్చిపోలేక పోతున్నట్లు చెప్పారు. ఢిల్లీలో ముమ్మటికీ ఆడవాళ్లకు భద్రత లేదని.. కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.
మనం రోజూ తీసుకునే మందుల విషయంలో చాలా చిన్న విషయాలను కూడా పట్టించుకోకపోవడం సాధారణం. ట్యాబ్లెట్ను నోట్లో వేసుకుని నీళ్లు…
చర్మంపై చిన్నచిన్న ముడతల్లా కనిపించే వార్ట్స్ (warts) చాలామందికి సాధారణంగా ఎదురయ్యే సమస్య. ఇవి సాధారణంగా ప్రమాదకరమైనవి కాకపోయినా, కనిపించే…
చిన్నప్పటి నుంచి సినిమాల్లో అడుగుపెట్టి, తర్వాత హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న నటీమణుల్లో తేజస్వి మదివాడఒకరు. తెరపై చలాకీగా కనిపించే ఆమె…
ముంబైలో జరిగిన ఇండియన్ నేషనల్ సినీ అకాడమీ అవార్డుల వేడుక సినీ ప్రముఖుల సందడితో అట్టహాసంగా జరిగింది. దేశవ్యాప్తంగా వివిధ…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిపవన్ కళ్యాణ్పై స్టాండప్ కామెడీ పేరుతో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదంగా మారాయి. అభ్యంతరకర వ్యాఖ్యలపై పోలీసులు…
తెలుగు ప్రేక్షకులకు ‘దేశముదురు’ సినిమాతో పరిచయమైన అందాల హన్సిక మోత్వాని, తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. తన…