Nayanatara: పిల్లలను నా గర్భంలో మోయకపోయినా అమ్మతనాన్ని ఆస్వాదిస్తున్నా… ఎమోషనల్ అయినా నయనతార!

Nayanatara: సౌత్ సినీ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా కొనసాగుతున్నటువంటి నయనతార ప్రస్తుతం తన వ్యక్తిగత జీవితంలో చాలా సంతోషంగా గడుపుతున్నారు.నటిగా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందినటువంటి ఈమె ఒక భార్యగా తల్లిగా కూడా ప్రమోట్ అయ్యి తన వ్యక్తిగత జీవితంలో చాలా సంతోషంగా ఉన్నారని చెప్పాలి.

ఈమె హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలో ప్రభుదేవాతో పాటు నటుడు శింబుతో ప్రేమ ప్రయాణం నడిపించారు. అనంతరం వీరి ప్రేమ బ్రేకప్ కావడంతో దర్శకుడు విగ్నేష్ శివన్ తోప్రేమలో పడటం అనంతరం కొంతకాలం పాటు రిలేషన్ లో ఉన్నటువంటి వీరిద్దరూ ఎట్టకేలకు గత ఏడాది జూన్ 9వ తేదీ వివాహం చేసుకున్నారు.

ఇలా వివాహం చేసుకున్నటువంటి ఈ దంపతులు పెళ్లి జరిగినటువంటి నాలుగు నెలలకే సరోగసి ద్వారా ఇద్దరు కవల మగ పిల్లలకు జన్మనిచ్చారు.ఇలా సరోగసి ద్వారా తల్లిదండ్రులు కావడంతో ఈ విషయం అప్పట్లో పెద్ద ఎత్తున వివాదంగా మారింది. అయితే అందుకు సంబంధించిన అన్ని వివరాలను నయనతార దంపతులు ప్రభుత్వానికి సమర్పించడంతో ఈ వివాదం ముగిసిందని చెప్పాలి.

Nayanatara: వారే నా జీవితం…


ఈ విధంగా ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చినటువంటి నయనతార ప్రస్తుతం ఆ పిల్లలతో ఎంతో సంతోషంగా గడుపుతున్నారు. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె తన పిల్లల గురించి మాట్లాడుతూ ఎమోషనల్ కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా నయనతార మాట్లాడుతూ పిల్లలను నా గర్భంలో పెంచకపోయిన తాను అమ్మతనాన్ని ఆస్వాదిస్తున్నానని తెలిపారు. వారు నా జీవితంలోకి వచ్చిన తర్వాత జీవితమే మారిపోయిందని వారితోనే రోజు మొదలై వారితోనే నా రోజు ముగుస్తుంది అంటూ ఈ సందర్భంగా నయనతార ఎమోషనల్ అవుతూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి..