Nayanatara: భర్తను అవమానించిన హీరోతో నటించను… షాకింగ్ డెసిషన్ తీసుకున్న నయనతార?

Nayanatara: దక్షిణాది సిని ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఇలా వరుస సినిమాలతో ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్న నయనతార ప్రస్తుతం ఒక్కో సినిమాకు ఏకంగా 10 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటూ ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్నారు.

ఇకపోతే నయనతార భర్త విగ్నేష్ శివన్ దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ ఓ సినిమా చేయబోతున్నారని ప్రకటించారు. అయితే కొన్ని కారణాల వల్ల ఈ సినిమా ఆగిపోయిందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే విగ్నేష్ పూర్తిగా డిప్రెషన్ లోకి వెళ్లిపోయారని సమాచారం.

ఇలా తన సినిమాకు తన భర్తను ఎంపిక చేసి అనంతరం ఆ సినిమా నుంచి తొలగించడంతో నయనతార ఈ విషయంలో చాలా ఫీలయ్యారని దీంతో ఈమె షాకింగ్ డెసిషన్ తీసుకున్నారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. తన భర్తను అవమానించిన హీరోతో తాను జీవితంలో సినిమా చేయకూడదని నిర్ణయాన్ని నయనతార తీసుకున్నట్టు సమాచారం.ఎంత రెమ్యూనరేషన్ ఇచ్చినప్పటికీ ఇకపై అజిత్ సినిమాలలో నటించకూడదని నయనతార నిర్ణయించుకున్నారట.

Nayanatara: జవాన్ సినిమాతో బిజీగా నయనతార…

ఇలా అజిత్ సినిమాల విషయంలో నయనతార తీసుకున్నటువంటి ఈ నిర్ణయానికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి ఇందులో ఎంతవరకు నిజముందో తెలియదు. ఇక నయనతార ప్రస్తుతం షారుక్ ఖాన్ హీరోగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న జవాన్ సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్నారు.