Nayanathara: బుర్జ్ ఖలీఫా వద్ద భర్త పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరిపిన నయనతార.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Nayanathara: లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రస్తుతం తన వైవాహిక జీవితాన్ని ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు. గత ఏడు సంవత్సరాల నుంచి దర్శకుడు విగ్నేష్ ప్రేమలో ఉన్నటువంటి ఈమె ఈ ఏడాది జూన్ నెలలో తన భర్తను ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు. వీరి వివాహం తర్వాత నయనతార ఒకవైపు సినిమాలలో నటిస్తూనే తనకు ఏ మాత్రం విరామం దొరికిన విదేశాలకు వెళ్తూ భర్తతో కలిసి ఎంజాయ్ చేస్తుంది.

ఈ క్రమంలోనే నయనతార దంపతులు ప్రస్తుతం దుబాయ్ లో ఉన్నట్టు తెలుస్తోంది. ఇక దుబాయ్ పర్యటనలో ఉన్నటువంటి ఈమె తన భర్త విగ్నేష్ పుట్టినరోజు కావడంతో తన భర్తకు సర్ప్రైజ్ పార్టీ అరేంజ్ చేశారు. దుబాయిలో అత్యంత అందమైనటువంటి
బుర్జ్ ఖలీఫా దగ్గర తన భర్త పుట్టినరోజు వేడుకలను ఎంతో ఘనంగా సెలబ్రేట్ చేశారు. ఇలా తన భర్త వేడుకలలో భాగంగా విగ్నేష్ తల్లి ఆయన సోదరుడు కూడా పాల్గొన్నారు.

ఇలా దుబాయ్ లో విగ్నేష్ కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుక జరుపుకోవడమే కాకుండా పెద్ద ఎత్తున టపాసులు పేలుస్తూ ఈయన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇక ఈ పుట్టిన రోజు సందర్భంగా విగ్నేష్ సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్ట్ చేశారు. స్వచ్ఛమైన ప్రేమను అందించి నా కుటుంబంతో పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నాను. నా ప్రియమైన వారందరితో కలిసి బుర్జ్ ఖలీఫా కింద నా భార్య కలలు కనే పుట్టినరోజు…ఇంతకన్నా గొప్పది ఏది ఉండదు ఇలా నా జీవితంలో ఆనందమైన క్షణాలను అందించినందుకు భగవంతునికి ధన్యవాదాలు అంటూ ఈయన ఎమోషనల్ పోస్ట్ చేశారు.

Nayanathara: జవాన్ సినిమాతో బిజీగా ఉన్న నయనతార..

ఈ విధంగా నయనతార తన భర్తకు పుట్టినరోజు వేడుకలు నిర్వహించినటువంటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హీరో షారుక్ ఖాన్ తో కలిసి జవాన్ అనే సినిమాలు నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ద్వారా ఈమె బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఇలా వివాహం తర్వాత కూడా ఈమె సినిమాలు చేస్తూ ఎంతో బిజీగా గడుపుతున్నారు.