Shilpa Shetty

శిల్పాశెట్టికి మరో షాక్.. శిల్పాతో పాటు ఆమె త‌ల్లిపై ఎఫ్ఐఆర్ నమోదు

పోర్నోగ్రఫీ కేసులో భర్త రాజ్‌కుంద్రా అరెస్ట్‌తో ఇప్పటికే ఇబ్బందులు ఎదుర్కొంటున్న శిల్ప శెట్టి కుటుంబం.. తాజాగా మరో వివాదంలో ఇర్కుకుంది. శిల్పా, ఆమె తల్లి తమ వద్ద కోట్ల రూపాయలు తీసుకుని మోసం చేశారంటూ జ్యోత్స్న చౌహాన్, రోహిత్ వీర్ సింగ్ అనే ఇద్దరూ పోలీస్ స్టేష‌న్‌ల‌లో ఫిర్యాదు చేశారు. దీంతో శిల్పాను, ఆమె తల్లిని విచారించేందుకు డీసీపీ నేతృత్వంలోని ఓ బృందం ముంబై చేరుకుంది.

Shilpa Shetty

శిల్పాశెట్టి అయోసిస్‌ వెల్‌నెస్‌ అండ్‌ స్పా పేరుతో ఫిటినెస్‌ సెంటర్‌ను నిర్వహిస్తోంది. ఈ సంస్ధకు శిల్ప చైర్మన్‌గా ఉండగా, ఆమె తల్లి సునంద డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. సంస్థ విస్తరణలో భాగంగా మరో బ్రాంచ్‌ను లక్నోలో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. జ్యోత్స్న చౌహాన్‌, రోహిత్‌ వీర్‌ సింగ్‌ అనే ఇద్దరికి వారి ఫ్రాంచెజ్‌ నెలకొల్పడానికి అనుమతి ఇచ్చి ఇరువురు దగ్గర నుండి కోటికి పైగా డబ్బులు తీసుకున్నారు. డబ్బులు తీసుకున్న త‌ర్వాత ప్రాంఛైజీ విషయంలో శిల్ప నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో.. తల్లి,కూతుళ్ళు తమను మోసం చేశార‌ని పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు.