Nithiin: ఆ సినిమా చూసి వారం రోజులపాటు నిద్రపోలేదు… ఇప్పటికీ ఆ పాటకు ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు: నితిన్

Nithiin: టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ కృతి శెట్టి జంటగా ఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో శ్రేష్ఠ మూవీస్ బ్యానర్ పై సుధాకర్ రెడ్డి, నికిత రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన చిత్రం మాచర్ల నియోజకవర్గం. ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ ఆగస్టు 12వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఈ సినిమా విడుదల తేది దగ్గర పడటంతో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించారు.ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నితిన్ ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను ఇప్పటివరకు ఎన్నో సినిమాలలో నటించానని కానీ మాచర్ల నియోజకవర్గం సినిమాలో తాను ఒక ఐఏఎస్ పాత్రలో కనిపించబోతున్నట్లు తెలిపారు. ఈ సినిమా ఫుల్ ఎంత మాస్ యాక్షన్ కమర్షియల్ చిత్రమని నితిన్ తెలిపారు.డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి ఇదివరకు ఎడిటర్ కావటం వల్ల ఈ సినిమాకి ఎంత కావాలో అంత మాత్రమే తీసుకున్నారు. సినిమాని ఎంతో అద్భుతంగా తెరకెక్కించారని వెల్లడించారు.

తాను ఇదివరకు నటించిన సినిమాలలో ఎన్నో యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నప్పటికీ ఈ సినిమాలో చాలా డిఫరెంట్ గా ఉంటాయని, ప్రతి ఒక్కరికి తప్పకుండా ఈ సినిమా నచ్చుతుంది అంటూ నితిన్ ధీమా వ్యక్తం చేశారు. ఇకపోతే సినిమాలు ఎప్పుడు ఒకే మూస దోరనిలో కాకుండా ఎంతో విభిన్నంగా తెరకెక్కించాలని అప్పుడే ప్రేక్షకుకు కూడా ఆ కొత్తదనం ఆస్వాదిస్తారని ఈయన తెలిపారు.

Nithiin: ఆ ఆలోచన తనకే వచ్చింది…

ఈ క్రమంలోనే తాజాగా వచ్చిన విక్రమ్ సినిమా తనకు ఎంత బాగా నచ్చిందని ఆ సినిమా చూసి దాదాపు వారం రోజుల పాటు తనకు నిద్ర కూడా పట్టలేదని ఈ సందర్భంగా వెల్లడించారు.ఇక మాచర్ల నియోజకవర్గం సినిమా గురించి ఈయన మాట్లాడుతూ ఇందులో ఏదైనా ఒక రీమిక్స్ సాంగ్ చేద్దామని ఆలోచన తనకు వచ్చిందని అందుకే తన కెరియర్లో బ్లాక్ బస్టర్ చిత్రమైన జయం సినిమాలో రాను రాను అంటుందనే పాటను రీమిక్స్ చేశామని, ఈ సినిమా విడుదల అయ్యికొన్ని సంవత్సరాలు గడిచిపోయినప్పటికీ ఈ పాటకు ఇంకా ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదని మంచి రెస్పాన్స్ వచ్చిందని ఈయన తెలిపారు.