Nayanthara -Vignesh Shivan: లేడీ సూపర్ స్టార్ నయనతార ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు రెండు దశాబ్దాలు అవుతున్నప్పటికీ ఈమె ఇండస్ట్రీలో వరుస సినిమా అవకాశాలను అందుకొని అగ్రతారగా కొనసాగుతున్నారు.సౌత్ ఇండియాలోనే భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న నటిగా పేరు సంపాదించుకున్న నయనతార తాజాగా తన ప్రియుడు విగ్నేష్ తో కలిసి వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన విషయం మనకు తెలిసిందే.
ఈ క్రమంలోనే వీరిద్దరి పెళ్లి మహాబలిపురంలోని ఒక రిసార్ట్ లో ఎంతో ఘనంగా జూన్ 9వ తేదీ జరిగింది. ఇక ఈమె పెళ్లి వేడుకను నెట్ ఫ్లిక్స్ భారీ ధరలకు కొనుగోలు చేయడంతో ఈమె పెళ్లి వేడుకకు అయ్యే ఖర్చును కూడా
నెట్ ఫ్లిక్స్ భరించింది. ఇలా నయనతార విగ్నేష్ పెళ్లి వేడుకను నెట్ ఫ్లిక్స్ కొనుగోలు చేయడంతో ఈమె పెళ్లికి సంబంధించిన ఎలాంటి వీడియోలు సోషల్ మీడియాలో మనకు కనిపించలేదు.
తాజాగా నయనతార విగ్నేష్ పెళ్లికి సంబంధించిన ఒక టీజర్ ను నెట్ ఫ్లిక్స్ అధికారక సోషల్ మీడియా ఖాతా ద్వారా షేర్ చేశారు. ఇందులో నయనతార, విగ్నేష్ శివన్ ఇద్దరు ఒకరిపై మరొకరికున్న ప్రేమను వారి అభిప్రాయాలను తెలియజేశారు. ప్రస్తుతం ఈ టీజర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇకపోతే త్వరలోనే పెళ్లికి సంబంధించిన వేడుకను కూడా విడుదల చేయనున్నట్లు సమాచారం.
ఇకపోతే నయనతార పెళ్లికి బాలీవుడ్, అలాగే కోలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన పలువురు స్టార్ సెలబ్రిటీలు హాజరైనట్లు తెలుస్తోంది. ఇకపోతే ఇదివరకే నెట్ ఫ్లిక్స్ వీరి ఫ్రీ వెడ్డింగ్ ఫోటోలను కూడా షేర్ చేయడంతో ఒక్కసారిగా ఆ ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి.ఇక వివాహం తర్వాత నయనతార సినిమాలకు దూరమవుతుందని పెద్ద ఎత్తున వార్తలు వచ్చినప్పటికీ ఆ వార్తలలో నిజం లేదని ఈమె రెట్టింపు వేగంతో వరుస సినిమాలను అందుకొని బిజీగా ఉన్నారు.ప్రస్తుతం నాయనతార అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న జవాన్ సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నారు.
తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన ఏడాది వయసున్న చిన్నారి ఆర్యాన్ష్ ప్రస్తుతం అరుదైన జన్యుపరమైన వ్యాధితో పోరాడుతున్నాడు. చిన్న వయసులోనే…
బెంగళూరులో మూడు నెలల క్రితం చోటుచేసుకున్న ఆరేళ్ల చిన్నారి వెన్నెల మృతి కేసు తాజాగా సంచలన మలుపు తిరిగింది. మొదట…
ఇటీవలి కాలంలో ఆహార భద్రతపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా కూరగాయలు, పండ్లలో రసాయనాల వినియోగంపై తరచూ వార్తలు వెలువడుతుండటంతో…
హైదరాబాద్ నగరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లు అనారోగ్యానికి గురై చికిత్స…
ప్రపంచ వాతావరణ పరిస్థితులపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న…
తెలుగు బుల్లితెరపై ప్రసారమైన ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన పండు మాస్టర్, తన డ్యాన్స్…