ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది: నాగ చైతన్య

సోషల్ మీడియాలో సమంత నాగ చైతన్య దంపతుల గురించి గత కొద్ది రోజులుగా ఎన్నో వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ క్రమంలోనే శనివారం సోషల్ మీడియా వేదికగా నాగచైతన్య స్పందిస్తూ తాము వివాహ బంధం నుంచి విడిపోతున్నాం అని చెబుతూ… వారి విడాకుల గురించి అధికారిక ప్రకటన చేయడంతో ఒక్కసారిగా అక్కినేని అభిమానులు షాక్ కి గురయ్యారు.ఈ విషయం వెల్లడించిన తర్వాత చైతన్య మరోసారి సోషల్ మీడియాలో ఏ విధమైనటువంటి పోస్టులు చేయలేదు.

తాజాగా నేడు నాగచైతన్య సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఇప్పుడు చాలా హ్యాపీగా ఉందని ట్వీట్ చేశారు. అయితే తన సంతోషానికి కారణం ఏంటనే విషయానికి వస్తే… సెప్టెంబర్ 10వ తేదీన హైదరాబాద్ లో రోడ్డు ప్రమాదానికి గురైన మెగాహీరో సాయిధరమ్ తేజ్ ఇప్పటికి అపోలో హాస్పిటల్ లో ఉంటూనే చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఆరోగ్యం గురించి అభిమానులు ఆందోళన పడుతున్నారు.

తాజాగా నిన్న సాయి ధరమ్ తేజ్ సోషల్ మీడియా వేదికగా తాను ఆరోగ్యంగా ఉన్నానని, కోలుకుంటున్నానని ట్విట్టర్ ద్వారా తెలియజేయడంతో పలువురు సెలబ్రిటీలు ఈ ట్వీట్ పై స్పందిస్తున్నారు. ఈ క్రమంలోనే నాగచైతన్య సాయి తేజ్ ట్వీట్ పై సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది ప్రేమతో అని నాగచైతన్య ట్వీట్ చేశారు.

సమంతతో విడాకులు ప్రకటించిన తర్వాత సోషల్ మీడియా వేదికగా స్పందించని నాగచైతన్య మొట్టమొదటిసారిగా సాయి తేజ ఆరోగ్యం గురించి స్పందించడంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇకపోతే సాయి తేజ్ ట్వీట్ చేయడంతో మెగా అభిమానులు తన ఆరోగ్యానికి ఏ ప్రమాదం లేదని తెగ సంబర పడుతున్నారు.