సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అతికొంత సమయం లోనే ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటీమణులలో సాయిపల్లవి ఒకరు. ఎంతో విభిన్నమైన పాత్రలను ఎంపిక చేసుకుని తనదైన శైలిలో దూసుకుపోతున్న సాయిపల్లవి గ్లామరస్ పాత్రలలో నటించకుండా అద్భుతమైన విజయాలను అందుకుంటున్నారు.
ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య సరసన లవ్ స్టోరీ సినిమాలో నటించిన సంగతి మనకు తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న సాయి పల్లవి అభిమానులకు ఒక షాకింగ్ విషయాన్ని తెలియజేశారు. సాయి పల్లవి వ్యక్తిగత విషయానికి వస్తే…టిబిలిసి స్టేట్ మెడికల్ యూనివర్సిటీ నుండి పట్టభద్రురాలైంది. ప్రస్తుతం సాయి పల్లవి శిక్షణ పొందిన ఒక డాక్టర్ అని చెప్పవచ్చు.
ఇలా డాక్టరేట్ పొందిన సాయి పల్లవి తన చుట్టూ ఉన్న వారికి సహాయం చేయడానికి డాక్టర్ వృత్తిని చేపట్టాలని భావించినట్లు ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో తెలియజేశారు. ఈ క్రమంలోనే సినిమాలకు గుడ్ బై చెప్పనుందా అంటే.. తనకు ఏ విధమైనటువంటి ఛాలెంజింగ్ రోల్స్ వచ్చిన తప్పకుండా సినిమాలలో నటిస్తానని ఈ సందర్భంగా సాయి పల్లవి తెలియజేశారు.
ప్రస్తుతం సాయిపల్లవి నటించిన లవ్ స్టోరీ మంచి విజయాన్ని అందుకుంది. ఇక ప్రస్తుతం ఈమె నాని హీరోగా నటిస్తున్నటువంటి ‘శ్యామ్ సింగ రాయ్’లో నటిస్తున్నారు. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో ఎంసీఏ విడుదలయ్యి మంచి విజయాన్ని అందుకున్న సంగతి మనకు తెలిసిందే.
తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన ఏడాది వయసున్న చిన్నారి ఆర్యాన్ష్ ప్రస్తుతం అరుదైన జన్యుపరమైన వ్యాధితో పోరాడుతున్నాడు. చిన్న వయసులోనే…
బెంగళూరులో మూడు నెలల క్రితం చోటుచేసుకున్న ఆరేళ్ల చిన్నారి వెన్నెల మృతి కేసు తాజాగా సంచలన మలుపు తిరిగింది. మొదట…
ఇటీవలి కాలంలో ఆహార భద్రతపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా కూరగాయలు, పండ్లలో రసాయనాల వినియోగంపై తరచూ వార్తలు వెలువడుతుండటంతో…
హైదరాబాద్ నగరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లు అనారోగ్యానికి గురై చికిత్స…
ప్రపంచ వాతావరణ పరిస్థితులపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న…
తెలుగు బుల్లితెరపై ప్రసారమైన ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన పండు మాస్టర్, తన డ్యాన్స్…