Paritala Nirupam -Manjula: 18 ఏళ్ల తర్వాత కొత్త ఇంట్లోకి అడుగుపెట్టబోతున్న డాక్టర్ బాబు దంపతులు.. వీడియో వైరల్!

Paritala Nirupam -Manjula: బుల్లితెర నటీనటులుగా ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వారిలో పరిటాల నిరూపమ్ మంజుల దంపతుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నటుడు నిరూపమ్ కార్తీకదీపం సీరియల్ ద్వారా డాక్టర్ బాబుగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.ప్రస్తుతం ఈ భార్యాభర్తలిద్దరూ కూడా పలు సీరియల్స్ లో నటిస్తూ మరోవైపు యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా సందడి చేస్తున్నారు.

ఇలా తన యూట్యూబ్ ఛానల్ ద్వారా మంజుల తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు. ఈ క్రమంలోనే తాజాగా వీరు యూట్యూబ్ ఛానల్ ద్వారా తమకి ఒక కొత్త ఇల్లు ఉందని త్వరలోనే ఆ ఇంట్లోకి షిఫ్ట్ అవ్వబోతున్నాం అంటూ తెలియచేశారు.

ఈ సందర్భంగా మంజుల తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ ఇల్లు మొత్తం తిరిగి చూపించారు. ప్రస్తుతం ఇంటీరియర్ డిజైన్ జరుగుతుందని త్వరలోనే ఈ ఇంట్లోకి మారబోతున్నామని తెలిపారు. ఇక ఈ ఇంటి గురించి డాక్టర్ బాబు కూడా మాట్లాడుతూ… ఇల్లు తన తండ్రి బుక్ చేశారని సినీ కార్మికుల కోసం ప్రభుత్వం మంజూరు చేసిన హౌసింగ్ సొసైటీ ద్వారా ఇల్లు వచ్చిందని తెలిపారు.

Paritala Nirupam -Manjula:అప్పుడు 3 HBK.. ఇప్పుడు డూప్లెక్స్

ఇలా ఈ ఇల్లు సాంక్షన్ అయిన తర్వాత నాన్నగారు చనిపోవడంతో అది తన పేరు మీద మారడానికి ఆలస్యమైందని, ఈ ఇల్లు బుక్ చేసి కూడా దాదాపు 18 సంవత్సరాలు అవుతుందని తెలిపారు. ముందు ఈ ఇంటిని 3 HBK అనుకున్నారు. ఆ తర్వాత దానిని డూప్లెక్స్ ఫ్లాట్ గా అప్డేట్ చేశారని ఈయన తెలియజేశారు. అలా ఈ ఇల్లు మరింత ఆలస్యం అవుతూ వచ్చిందని ఈ సందర్భంగా నిరుపమ్ వెల్లడించారు.