Pavitra Lokesh: ఆ డబ్బు నొక్కేయడానికే నరేష్ ను తగులుకుంది… పవిత్ర పై షాకింగ్ కామెంట్ చేసిన సుచేంద్ర!

Pavitra Lokesh: తెలుగు చిత్ర పరిశ్రమలో నటిగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న పవిత్ర లోకేష్ గత కొద్ది రోజులుగా తన వ్యక్తిగత కారణాల వల్ల వార్తల్లో నిలుస్తున్నారు.ఈమె నటుడు నరేష్ తో రిలేషన్ లో ఉండడమే కాకుండా త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాం అంటూ గత కొద్దిరోజులుగా ప్రకటిస్తూ వచ్చారు.

తాజాగా వీరిద్దరూ పెళ్లి చేసుకున్నటువంటి ఒక వీడియోని షేర్ చేయడంతో ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఇది నిజమైన పెళ్లి కాదని సినిమా ప్రమోషన్ లో భాగమేనని వార్తలు వస్తున్నాయి. ఇకపోతే తాజాగా ఈ పెళ్లి వీడియోపై పవిత్ర మొదటి భర్త సుచెంద్ర ప్రసాద్ స్పందించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పవిత్రకు డబ్బు వ్యామోహం ఎక్కువ నన్ను పెళ్లి చేసుకొని నాతో ఇద్దరు పిల్లలను కనీ నా దగ్గర డబ్బు లేకపోవడంతో నన్ను పిల్లలను వదిలేసి వెళ్లిపోయి నరేష్ ను తగులుకుంది. విజయనిర్మల గారు సంపాదించినటువంటి 1500 కోట్ల ఆస్తి నొక్కేయడానికే పవిత్ర నరేష్ తో రిలేషన్ లో ఉన్నారని తెలిపారు.

Pavitra Lokesh: డబ్బు వ్యామోహం ఎక్కువ…

పవిత్రకు బంధం, బంధాలు కన్నా డబ్బే ఎక్కువని తనకు డబ్బు వ్యామోహం ఉందని సుచేంద్ర సంచలన వ్యాఖ్యలు చేశారు.ఇలా పవిత్ర గురించి ఈయన చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి ఈ వ్యాఖ్యలపై పవిత్ర స్పందన ఎలా ఉంటుందో తెలియాల్సి ఉంది.