ఆ రోజు రాత్రంతా నిద్ర లేకుండా గడిపిన పవన్ కళ్యాణ్..!

మెగాహీరో సాయిధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారనే వార్త తెలియడంతో అందరికంటే ముందుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన మేనల్లుడుని పరామర్శించిన సంగతి మనకు తెలిసిందే.దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కలసి ఆస్పత్రికి చేరుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సాయి ధరమ్ తేజ్ ను పరామర్శించిన అనంతరం తన బాగోగుల గురించి కుటుంబ సభ్యులకు వెల్లడించారు.

తన మేనల్లుడికి ఏ విధమైనటువంటి ప్రమాదం లేదని అపోలో వైద్యులు తెలిపేవరకు ఆయనకు నిద్ర పట్టడం లేదని ఆ రోజు రాత్రంతా అలాగే ఆలోచిస్తూ కంగారుపడుతూ కూర్చున్నారని పవన్ కళ్యాణ్ సన్నిహితులు వెల్లడించారు.సాయి ధరమ్ తేజ్ పవన్ కళ్యాణ్ కి మేనల్లుడు అయినప్పటికీ వీరిద్దరి మధ్య ఎంతో సన్నిహిత సంబంధం ఉంది.

పవన్ కళ్యాణ్ తో సాయి ధరమ్ తేజ్ కు ఉన్న అనుబంధం గురించి సాయి తేజ్ పలు సందర్భాలలో వివరించారు. సాయి తేజ్ ప్రమాదానికి గురైన వెంటనే గతంలో తన మామయ్య తనకు బండి నడిపే విషయంలో ఎలాంటి జాగ్రత్తలు చెప్పారు అనే విషయాన్ని ఓ ఇంటర్వ్యూ సందర్భంగా చెప్పారు ఆ వీడియోను ప్రస్తుతం సోషల్ మీడియాలో మెగా అభిమానులు వైరల్ చేయడం మనకు తెలిసిందే.

సాయి తేజ్ కు బైక్ నడపడం అంటే ఎంతో ఇష్టం ఉండడం చేత మొట్టమొదటిసారిగా తన సంపాదనతో కొన్న కొత్త బండి తీసుకుని తన మామయ్య దగ్గరికి వెళ్తే హెల్మెట్ కొన్నావా అనే ప్రశ్నను అడిగినట్టు సాయి తేజ్ ఓ సందర్భంలో వెల్లడించారు. ఇలా వీరిద్దరి మధ్య ఎంతో అనుబంధం ఉండటం చేత సాయి తేజ్ ప్రమాదానికి గురయ్యారన్న వార్త పవన్ కళ్యాణ్ ఎంతో కలచివేసిందని, అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించే వరకు తనకు నిద్రపట్టడం లేదని సాయి ధరమ్ ప్రమాదానికి గురైన రోజంతా పవన్ కళ్యాణ్ నిద్రలేకుండా కంగారుపడుతున్నారని సన్నిహితవర్గాలు తెలియజేశారు.