బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చిన పింకీ.. నీ నుంచి అదే కోరుకుంటున్నాను అంటూ ఎమోషనల్!

బిగ్ బాస్ కార్యక్రమం 13వ వారం పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే 13వ వారం ప్రియాంక సింగ్ హౌస్ నుంచి బయటకు వచ్చారు. ఎప్పటిలాగే ఎంతో సరదాగా సాగిన సండే చివరికి భావోద్వేగంతో ముగిసింది. నాగార్జున పలు గేమ్స్ ఆడించి ప్రియాంక ఎలిమినేషన్ అని ప్రకటించడంతో ప్రియాంక భావోద్వేగంతో బిగ్ బాస్ కంటెస్టెంట్ లను వీడీ వేదికపైకి వచ్చింది.

వేదికపైకి వచ్చిన ప్రియాంక హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ ల గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. ఈ క్రమంలో ఆమె సిరి గురించి మాట్లాడుతూ తన కన్నా చాలా అందంగా ఉందని కుళ్ళు వేసిందనీ తను ఎప్పటికీ నా చెల్లి అంటూ చెప్పుకొచ్చింది. ఇక శ్రీరామచంద్రనీ శ్రీకృష్ణుడిని చేద్దామని భావించాను కానీ తన ఎప్పుడు రాముడు గానే ఉండి పోయాడు. ఇక హౌస్ లోకి అడుగు పెట్టగానే సన్నీ స్వప్న లోక సుందరి అంటూ పిలిచారు. కానీ తనని అన్నయ్య అని పిలిచి తన పరువు తీశారు అని చెప్పుకొచ్చారు.

షణ్ముఖ్ ఎప్పుడు పక్కింటి అబ్బాయిగా ఉంటారని, కాజల్ బాగా అల్లరి చేస్తుందని చెప్పారు.ఇక చివరిగా మానస్ గురించి మాట్లాడుతూ మొదటిగా హౌస్ లోకి వచ్చినప్పుడు తనకు హాయ్ చెప్తే అసలు పట్టించుకోలేదు తనకు చాలా పొగరు ఉందనిభావించి ఇకపై తనతో మాట్లాడకూడదు అనుకున్నాను కాకపోతే మా ఇద్దరి మధ్య మంచి రిలేషన్ ఏర్పడిందని ప్రియాంక చెప్పింది.

ఇక మానస్ గురించి మాట్లాడుతూ నీ నుంచి చాలా నేర్చుకున్నాను. నాకు నీ ఫ్రెండ్షిప్ కావాలి ఎప్పుడునేను నీ నుంచి ఏం ఆశిస్తున్నాను అని నన్ను పదేపదే అడుగుతున్నావు కదా నేను నీ నుంచి ఎప్పుడు నీ విజయాన్ని కోరుకుంటాను అని ప్రియాంక గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యారు.ఇక హౌస్ లో ఉన్నటువంటి మానస్, శ్రీరామచంద్ర పింకీ కోసం పాటలు పాడుతూ తనకు అంకితం ఇచ్చారు. ఇలా ప్రియాంక సింగ్ ఎంతో భావోద్వేగంగా హౌస్ ను వీడారు.