విజయ్ సేతుపతిని తంతే రివార్డు..అని ప్రకటించిన వ్యక్తిని అరెస్టు చేసిన పోలీసులు?

తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన ఎన్నో తమిళ చిత్రాలలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఉప్పెన సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరైనా విజయ్ సేతుపతి పై బెంగళూరు ఎయిర్ పోర్టులో ఒక వ్యక్తి దాడి చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇది చాలా చిన్న గొడవ అని విజయ్ సేతుపతి వెల్లడించారు.

విజయ్ సేతుపతిని ఎవరైతే తంతారో వారికి 1001 అవార్డును ఇస్తున్నట్లు హిందూ మక్కల్‌ కట్చి నాయకుడు అర్జున్‌ సంపత్‌ కొద్దిరోజుల క్రితం ప్రకటించారు. ఈ క్రమంలో ఇతని పై పోలీసులు కేసు నమోదు చేసి అతనిని అరెస్టు చేశారు.ఇండియన్‌ పీనల్‌ కోడ్‌లోని సెక్షన్‌ 504, సెక్షన్‌ 506(1) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

అయితే అతను అవార్డును ప్రకటించడానికి గల కారణం ఏమిటి అనే విషయానికి వస్తే..స్వాతంత్య సమరయోధుడైన ముత్తు రామలింగం తేవర్‌’ను విజయ్‌ సేతుపతి అవమానించడంతో అతనిపై దాడి చేసిన వారికి నగదు బహుమానంగా ప్రకటిస్తానని అర్జున్ వెల్లడించారు. ఎయిర్ పోర్ట్ లో సెక్యూరిటీ ఉన్నప్పటికీ విజయ్ సేతుపతి పై దాడి జరగడం చాలా చిన్న విషయమని ఈ ఘటనపై విజయ్ సేతుపతి స్పందించారు.

ఒక స్టార్ హీరో పై విధమైనటువంటి దాడి జరగడం పట్ల విజయ్ సేతుపతి అభిమానులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు అయితే పోలీసులు అతనిని అదుపులోకి తీసుకోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇక విజయ్ సేతుపతి మాదిరిగానే తమిళ హీరో సూర్య పై దాడి చేసిన వారికి లక్ష రూపాయల బహుమానాన్ని ప్రకటిస్తానని పీఎంకే పార్టీ నేత వెల్లడించిన విషయం కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఏది ఏమైనా తమిళ్ హీరోలకు ఇలాంటి అనుభవం ఎదురవడంతో ఎంతో మంది నెటిజన్లు సినీ ప్రముఖులు వీరికి మద్దతు తెలుపుతున్నారు.