Pooja Hedge: పూజా హెగ్డే పై మండిపడుతున్న మహేష్ ఫ్యాన్స్… మరింత ఆలస్యం కానున్న SSMB28!

Pooja Hedge:టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమా అనంతరం త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాతో బిజీ అయ్యారు. అయితే ఈ సినిమా షూటింగ్ మొదలైన కొద్ది రోజులకే మహేష్ బాబు తల్లి తండ్రి ఇద్దరు మరణించడంతో మహేష్ బాబు పుట్టెడు దుఃఖంలో ఉన్నారు.ఇలా ఆయన ఎంతో బాధలో ఉన్నప్పటికీ తన తండ్రి మరణించిన వారం రోజులకే సినిమా షూటింగుకు తాను సిద్ధంగా ఉన్నానని డైరెక్టర్ కు కబురు పంపారు.

ఇలా మహేష్ బాబు సినిమా షూటింగ్ కు సిద్ధంగా ఉన్నప్పటికీ ఈ సినిమా మరింత ఆలస్యం కానుందని తెలుస్తుంది.అయితే ఈ సినిమా ఆలస్యం కావడానికి గల కారణం కేవలం పూజ హెగ్డే అని తెలియడంతో మహేష్ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున నటి పూజా హెగ్డే పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికే షూటింగ్ పూర్తి కావాల్సిన ఈ సినిమా మహేష్ బాబు తల్లిదండ్రులను కోల్పోవడం వల్ల ఆలస్యమైంది.

ఇక మహేష్ బాబు సినిమా షూటింగ్ కి సిద్ధమని కబురు పంపినప్పటికీ పూజా హెగ్డే మాత్రం ఈ సినిమా షూటింగ్లో పాల్గొనలేకపోతున్నారు.అందుకు గల కారణం ఈమె రెండు బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్న నేపథ్యంలో డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో ఈ సినిమా వాయిదా వేసినట్టు సమాచారం.ఇలా పూజా హెగ్డే బాలీవుడ్ సినిమాలకు ఇచ్చిన ప్రాధాన్యత టాలీవుడ్ సినిమాలకు ఇవ్వలేదని మహేష్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.

Pooja Hedge:బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్న పూజ హెగ్డే..

ఈ విధంగా తెలుగు సినిమాల పట్ల ఏమాత్రం అంకితభావం లేనటువంటి పూజా హెగ్డేని వెంటనే ఈ సినిమా నుంచి తప్పించాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తి కావాల్సిన ఈ సినిమా మరింత ఆలస్యం కానుందని తెలియడంతో మహేష్ అభిమానులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.