Pooja Hedge:టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమా అనంతరం త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాతో బిజీ అయ్యారు. అయితే ఈ సినిమా షూటింగ్ మొదలైన కొద్ది రోజులకే మహేష్ బాబు తల్లి తండ్రి ఇద్దరు మరణించడంతో మహేష్ బాబు పుట్టెడు దుఃఖంలో ఉన్నారు.ఇలా ఆయన ఎంతో బాధలో ఉన్నప్పటికీ తన తండ్రి మరణించిన వారం రోజులకే సినిమా షూటింగుకు తాను సిద్ధంగా ఉన్నానని డైరెక్టర్ కు కబురు పంపారు.
ఇలా మహేష్ బాబు సినిమా షూటింగ్ కు సిద్ధంగా ఉన్నప్పటికీ ఈ సినిమా మరింత ఆలస్యం కానుందని తెలుస్తుంది.అయితే ఈ సినిమా ఆలస్యం కావడానికి గల కారణం కేవలం పూజ హెగ్డే అని తెలియడంతో మహేష్ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున నటి పూజా హెగ్డే పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికే షూటింగ్ పూర్తి కావాల్సిన ఈ సినిమా మహేష్ బాబు తల్లిదండ్రులను కోల్పోవడం వల్ల ఆలస్యమైంది.
ఇక మహేష్ బాబు సినిమా షూటింగ్ కి సిద్ధమని కబురు పంపినప్పటికీ పూజా హెగ్డే మాత్రం ఈ సినిమా షూటింగ్లో పాల్గొనలేకపోతున్నారు.అందుకు గల కారణం ఈమె రెండు బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్న నేపథ్యంలో డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో ఈ సినిమా వాయిదా వేసినట్టు సమాచారం.ఇలా పూజా హెగ్డే బాలీవుడ్ సినిమాలకు ఇచ్చిన ప్రాధాన్యత టాలీవుడ్ సినిమాలకు ఇవ్వలేదని మహేష్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.
ఈ విధంగా తెలుగు సినిమాల పట్ల ఏమాత్రం అంకితభావం లేనటువంటి పూజా హెగ్డేని వెంటనే ఈ సినిమా నుంచి తప్పించాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తి కావాల్సిన ఈ సినిమా మరింత ఆలస్యం కానుందని తెలియడంతో మహేష్ అభిమానులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…