Poonam kaur: మోసం చేసి గెలవడం కంటే ఓడిపోవడమే మంచిది..పూనమ్ కామెంట్స్ పవన్ గురించేనా?

Poonam kaur: పూనమ్ కౌర్ ఇటీవల కాలంలో సినిమాలకు దూరమైన సోషల్ మీడియాలో మాత్రం ఈమె దూకుడు కనబడుస్తున్నారు సోషల్ మీడియా వేదికగా ప్రతి విషయం గురించి స్పందిస్తూ తనదైన శైలిలో పోస్టులు చేస్తుంటారు. ఇటీవల కాలంలో ఈమె ఏపీ రాజకీయాల గురించి సోషల్ మీడియా వేదికగా చేసే పోస్టులు సంచలనంగా మారుతున్నాయి.

గతంలో జగన్ ప్రభుత్వం పై ప్రశంసలు కురిపించిన ఈమె గత ఎన్నికల ఫలితాలు తర్వాత కూడా సోషల్ మీడియా వేదికగా చేస్తున్న పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఇకపోతే తాజాగా ట్విట్టర్ వేదికగా పూనమ్ చేసిన ట్వీట్ వైరల్ అవుతుంది. మోసం చేసి గెలవటం కంటే యోధుడిగా ఓడిపోవడమే మంచిది అంటూ ఈమె త్వీట్ చేశారు.

ఇక ఈమె ట్వీట్ వైరల్ గా మారడంతో ఈమె పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుని ఉద్దేశించే మాట్లాడారా అంటూ పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఏపీలో ఇటీవల వచ్చిన ఎన్నికల ఫలితాలలో కూటమి ఏకంగా 164 సీట్లను కైవసం చేసుకుంది. అయితే ఈ గెలుపు ప్రజలు ఇచ్చింది కాదని ఈవీయంలో మోసం జరిగింది అంటూ పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.

యోధుడిగా ఓడిపోవడం మేలు..
ఇలా ఈవీఎం ట్యాంపరింగ్ చేయటం వల్లే కూటమి గెలిచింది అంటూ కొంతమంది కోర్టును కూడా ఆశ్రయించారు ఇలాంటి తరుణంలోనే పూనమ్ చేసిన ఈ పోస్ట్ సంచలనంగా మారింది. అయితే గత కొంతకాలంగా పవన్ కళ్యాణ్ పట్ల పరోక్షంగా పోస్టులు చేస్తున్న విషయం మనకు తెలిసిందే.. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ గెలుపును ఉద్దేశిస్తూ కూడా ఈమె ఈ పోస్ట్ చేశారు అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు.