Poonam kaur: ఏపీ ఎన్నికల ఫలితాలపై షాకింగ్ కామెంట్స్ చేసిన పూనమ్ కౌర్.. ఈ కౌంటర్ ఎవరికీ?

Poonam kaur: ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఇటీవల విడుదలైన సంగతి మనకు తెలిసిందే. ఈ ఎన్నికలలో భాగంగా కూటమి ఏకంగా 164 స్థానాలలో అద్భుతమైన విజయం సాధించే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోంది. అయితే ఈ మెజారిటీ సాధించిన కూటమి సభ్యులకు ఇప్పటికే చిత్ర పరిశ్రమ అలాగే దేశవ్యాప్తంగా అభిమానులు కార్యకర్తలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ఈ క్రమంలోనే ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సినీనటి పూనమ్ ఇటీవల చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. ఈమె సోషల్ మీడియా వేదికగా ఏదైనా పోస్ట్ చేశారంటే అది ఎవరిని ఉద్దేశించి చేశారో అన్నది మాత్రం అర్థం కాదు కానీ ఇటీవల కాలంలో జగన్ ప్రభుత్వం పై ప్రశంసలు కురిపించి పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగా పోస్టులు చేసిన పూనం తాజాగా మరోసారి స్పందించారు.

ఈ సందర్భంగా ఎన్నికల ఫలితాలను ఉద్దేశిస్తూ ఈమె ‘వై నాట్ 175 అనే విషయాన్ని ఏపీ ప్రజలు చాలా సీరియస్‌గా తీసుకున్నట్టున్నారు’ అంటూ పోస్ట్ చేసింది. దీనికి #andhrapradesh అనే హ్యాష్ ట్యాగ్ ను జోడించింది. పూనమ్ షేర్ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈమె ఎవరిని ఉద్దేశించి చేశారో తెలియక తలలు పట్టుకుంటున్నారు.

వై నాట్ 175..
జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ఎన్నికల ప్రచార కార్యక్రమాలను నిర్వహించారు. కానీ ఈ ఎన్నికలలో భాగంగా ఆయనకు కేవలం 11 సీట్లు మాత్రమే రావడంతో వారికి కౌంటర్ ఇస్తూ ఇలాంటి పోస్ట్ చేశారా ఏంటి అంటూ నేటిజన్స్ ఆరా తీస్తున్నారు. మొత్తానికి ఈమె చేసిన ఈ పోస్ట్ సంచలనంగా మారింది.