Pravesh Shukla : ఒళ్ళు బలిసి మొహం మీద మూత్ర విసర్జన… మధ్యప్రదేశ్ లో అమానుష ఘటన… కాళ్ళు కడిగిన సీఎం…!

Pravesh Shukla : మధ్యప్రదేశ్ లో ఒక గిరిజన వ్యక్తి మీద అమానుష ఘటన జరిగింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటనలో ప్రవీణ్ శుక్ల అనే ఒక ఒళ్ళు బలిసిన వ్యక్తి ఒక వ్యక్తి మొహం మీద మూత్ర విసర్జన చేసాడు. చేస్తున్నపుడు వీడియో తీయించుకున్నాడు. ఇపుడు ఈ వీడియో దేశవ్యాప్తంగా వైరల్ అయింది. ప్రతి ఒక నేటిజెన్ ప్రవీణ్ శుక్ల మీద కోప్పడుతున్నారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ ప్రభుత్వాన్ని కూడా ఊపేసింది. రాజకీయ రంగు పులుముకుని మధ్యప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది.

కాళ్ళు కడిగిన సీఎం…

మొహం మీద మూత్ర విసర్జన చేసి అమానుషంగా ప్రవర్తించిన్న వ్యక్తి పేరు ప్రవీణ్ శుక్ల. ఇతను అక్కడి స్థానిక బీజేపీ ఎమ్మెల్యే మనిషి అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం మీద విరుచుకుపడటం మొదలు పెట్టింది. జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ యూపి లో ఇటీవలే ఇలాంటి ఘటన జరుగగా ఇపుడు మధ్య ప్రదేశ్ లో జరిగింది, దళితులు, గిరిజనుల మీద బీజేపీ పాలిత రాష్ట్రాలలో దాడులు జరుగుతున్నాయని విమర్శించారు.

అయితే మధ్యప్రదేశ్ ప్రభుత్వం ప్రవీణ్ శుక్ల బీజేపీ కి సంబంధం లేదని వాదించింది. అతని ఇంటిని కూల్చేసింది. ఇక బాధిత గిరిజన యువకుడు దేశమత్ రావత్ ను సీఎం ఇంటికి పిలిపించుకుని అక్కడ ఆయన ను కూర్చోబెట్టి సీఎం కింద కూర్చొని ఆయన కాళ్ళను ఒక పళ్లెంలో పెట్టి కడిగారు. ఆ పైన ఆయనకి తిలకం దిద్ది, దండ వేసారు. గిరిజనుల మీద దాడులను మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఉపేక్షించదని తెలిపారు. ఇప్పటికే ప్రవీణ్ శుక్ల ను అరెస్టు చేసి శిక్ష విధించారు.