Sad News: ఆసుపత్రి బాత్రూంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న బాలింత..కారణం ఏంటంటే?

Sad News: ఆసుపత్రి బాత్రూంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న బాలింత..కారణం ఏంటంటే?

Sad News: ఓ బాలింత ఆసుపత్రి బాత్రూంలో చీరతో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించి వివరాల్లోకి వెళ్తే.. కమాన్‌పూర్ మండలం రొంపికుంటకు చెందిన గుమ్మడి ఉమ గర్భవతి.

Sad News: ఆసుపత్రి బాత్రూంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న బాలింత..కారణం ఏంటంటే?
Sad News: ఆసుపత్రి బాత్రూంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న బాలింత..కారణం ఏంటంటే?

ఆమెకు 30 ఏళ్లు ఉంటాయి. ఆమె గర్భవతి అయి 9 నెలలు కావడంతో ఈ నెల 12 న నొప్పులతో ఇబ్బంది పడుతుండగా.. స్థానిక పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఆమెకు ఆపరేషన్ చేయడంతో మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఆమెకు మొదటి కాన్పు కావడం.. అంతే కాకుండా వాళ్లు పేదవారు కావడంతో ప్రభుత్వ ఆసుపత్రిలో చూపించాల్సి వచ్చింది.

Sad News: ఆసుపత్రి బాత్రూంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న బాలింత..కారణం ఏంటంటే?

ఆమెకు సీజేరియన్ చేసిన తర్వాత వైద్యులు కుట్లు వేశారు. అయితే ఏడు రోజుల తర్వాత ఆమె డిశ్చార్జ్ కావాల్సి ఉంది. కానీ ఆమెకు కుట్లు మానకపోవడంతో మరోసారి.. ఆపరేషన్ చేసి.. కుట్లు వేయాలని ఆసుపత్రి సిబ్బంది చెప్పారు.

ఆసుపత్రి సిబ్బందిపై చర్యలు తీసుకోవాలి:

అయితే మరోసారి ఆమెకు ఇలా సర్జరీ చేసి కుట్లు వేశారు. ఇక ఆమె ఈ నొప్పులకు భరించలేక.. అవి ఇంకా మానకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురైంది. ఇలా మనోవేదనకు గురై ఆమె బాత్ రూంలో చీరతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. అయితే ఆమె బంధువులు.. మూడుసార్లు కుట్లు వేశారని వైద్యుల నిర్లక్ష్యంతోనే ఆత్మహత్య చేసుకుందని ఆందోళనకు దిగారు. పుట్టిన మగశిశువు తల్లిలేని అనాథగా మారిందని.. ఉమా భర్త తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. ఆసుపత్రి సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు.