ఈ దశలో గర్భిణీలు జాగ్రత్తగా ఉండాలి.. లేదంటే ప్రమాదమంటున్న నిపుణులు?

ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా రెండవ దశ తీవ్రస్థాయిలో వ్యాపించి ఇప్పుడిప్పుడే కాస్త ఉపశమనం కలిగిస్తుంది. ఈ క్రమంలోనే త్వరలోనే మూడో దశ వ్యాప్తి చెందుతుందని ఇది మరింత ప్రమాదకరంగా మారబోతుందని ఇప్పటికే పలువురు నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలోనే మూడవ దశను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

తాజాగా రెయిన్ బో చిన్నపిల్లల ఆసుపత్రి ఛైర్మన్‌, ఎండీ, చిన్నపిల్లల వైద్యులు డాక్టర్‌ రమేష్‌ కంచర్ల ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కరోనా థర్డ్ వేవ్ గర్భిణీ మహిళ పై తీవ్రమైన ప్రభావాన్ని చూపించే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఈ క్రమంలోనే గర్భిణీ స్త్రీలు ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలని, ఏమాత్రం నిర్లక్ష్యం చేసిన వెంటిలేటర్ చికిత్స తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు.

రెండవ దశ కరోనా తీవ్రత గర్భిణీ స్త్రీల పై పడటంతో వారు కోలుకోవడానికి కష్టమైందని మరి కొందరిలో వ్యాధి తీవ్రత అధికంగా ఉండటం వల్ల వారికి చికిత్స అందించాల్సిన అవసరం వచ్చిందని తెలిపారు.సాధారణ వ్యక్తులతో పోలిస్తే గర్భిణీ స్త్రీలు శరీర బరువు పెరగడంతో పాటు వారిలో ఊపిరితిత్తుల ప్రక్రియ సక్రమంగా పనిచేయదు. ఈ క్రమంలోనే వారిలో ఆక్సిజన్ శాతం క్రమంగా తగ్గిపోతుందని వైద్య అధికారులు తెలిపారు.

కరోనా రెండవ దశలోనే తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్న మహిళలు మూడవ దశ వ్యాప్తి చెందితే మరింత తీవ్రమైన ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయని వీరు హెచ్చరించారు. మూడవ దశ గర్భిణీలలో వ్యాపిస్తే సాధారణ వ్యక్తుల కంటే వీరు ఎక్కువ ప్రమాదం బారిన పడే అవకాశాలు ఉన్నాయి.గర్భిణీ స్త్రీలలో ఈ వ్యాధి తీవ్రత ఎక్కువగా ఊపిరితిత్తుల పైన ప్రభావం చూపించే అవకాశాలు ఉన్నాయి కనుక తగినన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని లేకపోతే భారీ నష్టాన్ని ఎదుర్కోవలసి వస్తుందని నిపుణులు ఈ సందర్భంగా హెచ్చరించారు.