ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనాకు సంబంధించి తొలి డెల్టా ప్లస్ కేసు నమోదైంది. ఈ మేరకు మంత్రి ఆళ్లనాని ఈ విషయాన్ని మీడియాతో వెల్లడించారు. తిరుపతిలో డెల్టా ప్లస్ కేసు వచ్చిందని ఈ అయన తెలిపారు. ‘‘డెల్టా ప్లస్ సోకిన వ్యక్తికి చికిత్స కూడా పూర్తయింది. డెల్టా ప్లస్ సోకిన వ్యక్తి నుంచి ఎవరికీ వ్యాపించలేదు. బ్లాక్ ఫంగస్, డెల్టా ప్లస్ కేసుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. థర్డ్ వేవ్ వచ్చిన ఎదుర్కోవడానికి తాము సిద్ధంగా ఉండాం’’ అని ఆళ్లనాని పేర్కొన్నారు.
డెల్టా వేరియంట్ మన దేశంలో సెకండ్ వెవ్ కారణం అయ్యింది. దురదృష్టవశాత్తు అదే ఇప్పుడు మ్యూటేషన్ చెంది డెల్టాప్లస్ వేరియంట్గా కొత్త రంగు పులుముకుంది. ప్రస్తుతం మన దేశంలో ఈ వేరియంట్కు చెందిన కేసులు నమోదవుతున్నాయి.
మన దేశంలో ఇప్పటివరకు 40కి పైగా డెల్టా ప్లస్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం మహా రాష్ట్ర, కేరళ, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోనే ఈ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. అయితే కర్ణాటక, తమిళ నాడు, జమ్మూకశ్మీర్ రాష్ట్రాల్లో కూడా డెల్టా ప్లస్ కేసులు మొదలయ్యాయి. డెల్టా వేరియంట్ మాదిరిగా అత్యంత వేగంగా వ్యాప్తి చెందడం దీని లక్షణం, అదే విధంగా దక్షిణాఫ్రికా వేరియంట్ లానే టీకాల నుంచి తప్పించుకునే లక్షణం ఈ డెల్టా ప్లస్ కు ఉందని అందువల్ల అందరూ దీనిపై జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…
ఒకప్పుడు వెన్నునొప్పి, మెడ నొప్పి, వెన్నెముక సమస్యలు అంటే 50 ఏళ్లు దాటిన వారిలోనే ఎక్కువగా కనిపించేవి. వయసు పెరగడం,…
వైద్య శాస్త్రం రోజురోజుకూ కొత్త మైలురాళ్లు చేరుకుంటోంది. ఒకప్పుడు నయం చేయలేని వ్యాధులకు మందులు కనుగొన్న శాస్త్రవేత్తలు ఇప్పుడు వ్యాధులు…
ఈ రోజుల్లో చిన్నవాళ్ల నుంచి పెద్దవాళ్ల వరకు చాలా మందిని వేధిస్తున్న సమస్యల్లో అధిక బరువు ఒకటి. పని ఒత్తిడి,…
సినిమా అంటే అంకితభావం. పాత్ర అంటే బాధ్యత. ప్రేక్షకుల ముందు కనిపించే ప్రతి సన్నివేశం పరిపూర్ణంగా ఉండాలనే తపన. ఇవన్నీ…
నేటి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరిగిన కొద్దీ యోగా చేసే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. శారీరక ఆరోగ్యంతో పాటు…