ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనాకు సంబంధించి తొలి డెల్టా ప్లస్ కేసు నమోదైంది. ఈ మేరకు మంత్రి ఆళ్లనాని ఈ విషయాన్ని మీడియాతో వెల్లడించారు. తిరుపతిలో డెల్టా ప్లస్ కేసు వచ్చిందని ఈ అయన తెలిపారు. ‘‘డెల్టా ప్లస్ సోకిన వ్యక్తికి చికిత్స కూడా పూర్తయింది. డెల్టా ప్లస్ సోకిన వ్యక్తి నుంచి ఎవరికీ వ్యాపించలేదు. బ్లాక్ ఫంగస్, డెల్టా ప్లస్ కేసుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. థర్డ్ వేవ్ వచ్చిన ఎదుర్కోవడానికి తాము సిద్ధంగా ఉండాం’’ అని ఆళ్లనాని పేర్కొన్నారు.
డెల్టా వేరియంట్ మన దేశంలో సెకండ్ వెవ్ కారణం అయ్యింది. దురదృష్టవశాత్తు అదే ఇప్పుడు మ్యూటేషన్ చెంది డెల్టాప్లస్ వేరియంట్గా కొత్త రంగు పులుముకుంది. ప్రస్తుతం మన దేశంలో ఈ వేరియంట్కు చెందిన కేసులు నమోదవుతున్నాయి.
మన దేశంలో ఇప్పటివరకు 40కి పైగా డెల్టా ప్లస్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం మహా రాష్ట్ర, కేరళ, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోనే ఈ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. అయితే కర్ణాటక, తమిళ నాడు, జమ్మూకశ్మీర్ రాష్ట్రాల్లో కూడా డెల్టా ప్లస్ కేసులు మొదలయ్యాయి. డెల్టా వేరియంట్ మాదిరిగా అత్యంత వేగంగా వ్యాప్తి చెందడం దీని లక్షణం, అదే విధంగా దక్షిణాఫ్రికా వేరియంట్ లానే టీకాల నుంచి తప్పించుకునే లక్షణం ఈ డెల్టా ప్లస్ కు ఉందని అందువల్ల అందరూ దీనిపై జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇటీవలి కాలంలో బరువు తగ్గడం, షుగర్ నియంత్రణ కోసం వాడుతున్న GLP-1 తరహా మందులపై చర్చ పెరుగుతోంది. వైద్యుల సలహాతో…
ఉదయపు అల్పాహారంలో ఇడ్లీ, దోసె, ఉప్మా వంటి వంటకాలకు తోడు తప్పనిసరిగా కనిపించే వంటకం కొబ్బరి చట్నీ. సాధారణంగా రుచికోసం…
వేసవి మొదలవుతూనే ఆహారంలో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం, నీటి కొరత రాకుండా జాగ్రత్తపడటం ఈ…
కొబ్బరికాయ కొనడం చాలా సాధారణమైన పని అనిపించినా, చాలా సార్లు అది మనకు నిరాశ కలిగిస్తుంది. బయట నుంచి బాగానే…
ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ సహజమైన ఆహారాలపై ప్రజల దృష్టి మరింతగా పడుతోంది. అలాంటి వాటిలో “అల్ఫాల్ఫా” అనే మొక్క,…
ఇటీవలి కాలంలో ఆధ్యాత్మిక అంశాలపై ఆసక్తి పెరుగుతున్న కొద్దీ “స్పిరిట్ యానిమల్” అనే భావన కూడా సోషల్ మీడియాలో, యువతలో…