ప్రస్తుత కాలంలో చాలామంది ఎదుర్కొంటున్న సమస్య లో అధిక శరీర బరువు సమస్య ఒకటి. సాధారణంగా శరీర బరువు పెరగడానికి గల కారణం మనం తీసుకునే ఆహారం ఒక కారణం అయితే, నిద్రపోయే ముందు మనకు తెలిసి తెలియకుండా చేసే కొన్ని పొరపాట్లు కూడా మన శరీర బరువును పెంచడానికి కారణమవుతాయని నిపుణులు తెలియజేస్తున్నారు. మన శరీర బరువు పెరగకుండా ఉండాలంటే నిద్రపోయే ముందు పొరపాటున కూడా ఈ పనులు చేయకూడదు మరి ఆ పనులు ఏమిటో తెలుసుకుందాం..
చాలామంది రాత్రి భోజనం చేసిన వెంటనే నిద్ర పోతారు. ఈ విధమైనటువంటి అలవాటు ఉన్నవారు తొందరగా శరీర బరువు పెరుగుతారు. ఈ క్రమంలోనే పొట్ట విపరీతంగా పెరుగుతుంది కనుక మనం నిద్ర పోయే సమయానికి గంట ముందు భోజనం చేయడం ఎంతో మంచిది. అదే విధంగా ఉదయం నుంచి మన పై పడిన ఒత్తిడి, అధిక పని ప్రభావం మన మెదడులో ఉండటంవల్ల మన మెదడు కంటికి నిద్ర లేకుండా చేస్తుంది. తద్వారా నిద్రలేమి సమస్య ఏర్పడుతుంది.నిద్రలేమి సమస్య కూడా శరీర బరువు పెరగడానికి ఒక కారణం.
రాత్రి సమయంలో ఆలస్యంగా నిద్రపోవడం,నిద్రపోయే వరకు సెల్, లాప్టాప్ వంటి వాటిని చూడటం వల్ల మన కంటి పై అధిక ప్రభావం పడుతుంది. కంటి పై అధిక ప్రభావం చూపడం వల్ల నిద్ర భంగం కలుగుతుంది. ఇది క్రమేపీ మన శరీర బరువును పెంచడానికి దోహదం చేస్తుంది.
చాలామంది రాత్రి భోజనం చేసిన తర్వాత తిన్న చోటనే ఎక్కువసేపు కూర్చోవడం, లేదా తిన్న వెంటనే నిద్రపోతుంటారు. ఈ విధంగా భోజనం చేసిన తరువాత ఒకేచోట కూర్చుని పనిచేయడం వల్ల శరీర బరువు పెరుగుతారు. అందుకే రాత్రి భోజనం చేసిన పది నిమిషాల తరువాత కాసేపు వాకింగ్ చేయడం ఎంతో మంచిది. దీని ద్వారా శరీర బరువు పెరగకపోవడమే కాకుండా మనం తీసుకున్న ఆహారం తేలికగా జీర్ణం అవుతుంది అని నిపుణులు తెలియజేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…