విడాకులపై స్పందించిన ప్రియమణి.. ఆ ఫోటోతో రూమర్స్ అన్నింటికీ చెక్..!?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కన్నడ బ్యూటీ ప్రియమణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఎవరే అతగాడు సినిమాతో సినీ ఇండస్ట్రీ హీరోయిన్ గా పరిచయం అయ్యింది ఈ ముద్దుగుమ్మ. ఆ తరువాత తెలుగులో ఎన్నో సినిమాలలో నటించి మంచి సక్సెస్ ను అందుకుంది. తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోల సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అందంతో పాటు అభినయం ఉన్న అతి కొద్దిమంది హీరోయిన్ లలో ఈమె కూడా ఒకరు.

అయితే కేవలం తెలుగులో మాత్రమే కాకుండా ఇతర భాషల్లో కూడా నటించి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది.ఇది ఇలా ఉంటే ప్రియమణి వైవాహిక జీవితం ఇబ్బందుల్లో పడినట్లు కనిపిస్తోంది. భర్త ముస్తఫా రాజ్ మొదటి భార్య కొన్ని ఆరోపణలు చేయడంతో ప్రియమణి వైవాహిక జీవితం ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది.ప్రియమణి భర్త పై మొదటి భార్య కేసు నమోదు చేసింది.

ప్రియమణి భర్త ముస్తాఫా రాజ్ కు గతంలోనే ఆయేషా తో వివాహం జరిగింది. వారికి ఇద్దరు పిల్లలు సంతానం కూడా ఉన్నారు. ముస్తఫా ఆయేషా ఇప్పటికి విడాకులు తీసుకోలేదని అని ఆరోపించిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇక అప్పటి నుంచి ప్రియమణి,ముస్తఫా ల మధ్య గొడవలు వచ్చాయని వీరిద్దరి విడిపోతున్నారు అంటూ సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి.

తాజాగా ప్రియమణి ఈ వార్తలన్నింటికి చెక్ పెడుతూ దీపావళి పండుగ సందర్భంగా తన భర్త ముస్తఫా తో కలిసి దిగిన ఫోటోను తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. చిరునవ్వులు చిందిస్తున్న ఫోటోను పంచుకుంది. దీనితో విడాకుల విషయం పై వినిపిస్తున్న రూమర్స్ కు ప్రియమణి పరోక్షంగా చెక్ పెట్టినట్లు తెలుస్తోంది.