టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కన్నడ బ్యూటీ ప్రియమణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఎవరే అతగాడు సినిమాతో సినీ ఇండస్ట్రీ హీరోయిన్ గా పరిచయం అయ్యింది ఈ ముద్దుగుమ్మ. ఆ తరువాత తెలుగులో ఎన్నో సినిమాలలో నటించి మంచి సక్సెస్ ను అందుకుంది. తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోల సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అందంతో పాటు అభినయం ఉన్న అతి కొద్దిమంది హీరోయిన్ లలో ఈమె కూడా ఒకరు.
అయితే కేవలం తెలుగులో మాత్రమే కాకుండా ఇతర భాషల్లో కూడా నటించి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది.ఇది ఇలా ఉంటే ప్రియమణి వైవాహిక జీవితం ఇబ్బందుల్లో పడినట్లు కనిపిస్తోంది. భర్త ముస్తఫా రాజ్ మొదటి భార్య కొన్ని ఆరోపణలు చేయడంతో ప్రియమణి వైవాహిక జీవితం ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది.ప్రియమణి భర్త పై మొదటి భార్య కేసు నమోదు చేసింది.
ప్రియమణి భర్త ముస్తాఫా రాజ్ కు గతంలోనే ఆయేషా తో వివాహం జరిగింది. వారికి ఇద్దరు పిల్లలు సంతానం కూడా ఉన్నారు. ముస్తఫా ఆయేషా ఇప్పటికి విడాకులు తీసుకోలేదని అని ఆరోపించిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇక అప్పటి నుంచి ప్రియమణి,ముస్తఫా ల మధ్య గొడవలు వచ్చాయని వీరిద్దరి విడిపోతున్నారు అంటూ సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి.
తాజాగా ప్రియమణి ఈ వార్తలన్నింటికి చెక్ పెడుతూ దీపావళి పండుగ సందర్భంగా తన భర్త ముస్తఫా తో కలిసి దిగిన ఫోటోను తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. చిరునవ్వులు చిందిస్తున్న ఫోటోను పంచుకుంది. దీనితో విడాకుల విషయం పై వినిపిస్తున్న రూమర్స్ కు ప్రియమణి పరోక్షంగా చెక్ పెట్టినట్లు తెలుస్తోంది.
ప్రకృతిలో జరిగే కొన్ని ఖగోళ అద్భుతాలు మన కళ్లకు నేరుగా కనిపించకపోయినా వాటి ప్రభావాన్ని మాత్రం మనం స్పష్టంగా అనుభవిస్తాం.…
చిన్న వయసులో ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించని వారు చాలా మంది ఉంటారు. "ఇప్పుడేం కాదు.. తర్వాత చూసుకుందాం", "ఇంకా…
ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏ పని జరగని పరిస్థితి. ఉదయం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టిన దగ్గర…
మన తెలుగు వంటింట్లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. పప్పు నుంచి పులుసు వరకు, చట్నీ నుంచి ఫ్రై వరకు…
హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…