ఏపీలో నేటి నుంచి వర్షాలు

ఏపీలో నేటి నుంచి వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. పశ్చిమ దిశ నుంచి కోస్తాంధ్ర మీదుగా గాలులు వీస్తుండటంతో ఈ కారణంగా కోస్తా, రాయలసీమల్లో ప్రాంతంలో ఉష్ణోగ్రతలు తీవ్రమవుతున్నాయి. ఆగస్టు 12న బంగాళాఖాతం నుంచి అల్పపీడనం ఏర్పాడే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది. సముద్ర తీరు ప్రాంతలైన మచిలీపట్నం మీదుగా రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.


ఈ కారణంగా కోస్తా, రాయలసీమల్లో మోస్తారు వానలు కురిసే అవకాశాలు ఉన్నాయి. ఇక 13వ తేదీ తర్వాత అల్పపీడనం కారణంగా వర్షాలు ఊపందుకుంటాయని అధికారలు తెలిపారు.