ప్రపంచంలోనే అతిపెద్ద ఖగోళశాస్త్ర మ్యూజియంను చైనాలోని షాంఘైలో ఇటీవల ప్రారంభించారు. ఈ మ్యూజియం దాదాపు 39 వేల చదరపు మీటర్లు ఉంది. అబ్జర్వేటరీ, ప్లానిటోరియం,78 అడుగుల పొడవైన టెలిస్కోప్ ఇందులో ప్రత్యేక ఆకర్షణలు. ఈ మూజియం యొక్క డిజైన్ ను అమెరికన్ ఆర్కిటెక్ట్ కంపెనీ ఎనిడ్ తీయారు చేసింది.
ఇది అండాకార ఆకారంలో ఉంటుంది. ఎక్కడా కూడా ఎలాంటి మూలలు, రేఖలు ఉండవు. దీనిని ఆకాశం నుంచి చూస్తే ఆస్ట్రోలాబ్ లాగా కనిపిస్తుందని ప్రాజెక్ట్ లీడ్ డిజైనర్ థామస్ వాంగ్ తెలిపాడు. అయితే ఈ మూజియం యొక్క ప్రత్యేకతు ఏంటంటే.. ఖగోళశాస్త్ర విజ్ఞానానికి సంబంధించిన ఎన్నో విశేషాలు ఇక్కడ కనిపిస్తాయి. ఎన్నో ఉల్కల నమూనాలు ఇక్కడ కనిపిస్తాయి.
అంగారక గ్రహానికి సంబంధించి ఎన్నో విశేషాలను తెలుసుకోవచ్చు. గుండ్రంగా ఉన్న ఈ మ్యూజియంలో పర్యాటకులు బరువులేని అనుభూతిని పొందుతారు. అంటే అంతరిక్షంలో ఎలాగైతే జీరో గ్రావిటీ ఉంటుందో ఇక్కడ కూడా బరువును కోల్పోయి ఉంటారు. అంతేకాకుండా ఇక్కడ గాలిలో తేలుతున్న అనుభవం కూడా పొందే అవకాశం ఉంటుంది. అయితే ఈ మ్యూజియం సందర్శకుల కోసం తెరిచిన దగ్గర నుంచి విపరీతంగా సందర్శకులు తాకిడి ఎక్కువ అయింది.
ప్రపంచంలోనే ఎక్కువగా ఖగోళానికి సంబంధించిన విషయాలు ఇక్కడ ఉండటంతో అతి పెద్ద మ్యూజియం ఇదే అని చెబుతున్నారు. ఆకాశంలో జరిగే వింతలకు సంబంధించి ప్రతీ విషయం ఇక్కడ చూసే అవకాశం ఉంటుంది. అలా వాటిని సెట్ చేశారు.
ఆంధ్రప్రదేశ్లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…
భారత క్రికెట్లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…
నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…
ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…
హైదరాబాద్లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…