ప్రపంచంలోనే అతిపెద్ద ఖగోళశాస్త్ర మ్యూజియంను చైనాలోని షాంఘైలో ఇటీవల ప్రారంభించారు. ఈ మ్యూజియం దాదాపు 39 వేల చదరపు మీటర్లు ఉంది. అబ్జర్వేటరీ, ప్లానిటోరియం,78 అడుగుల పొడవైన టెలిస్కోప్ ఇందులో ప్రత్యేక ఆకర్షణలు. ఈ మూజియం యొక్క డిజైన్ ను అమెరికన్ ఆర్కిటెక్ట్ కంపెనీ ఎనిడ్ తీయారు చేసింది.
ఇది అండాకార ఆకారంలో ఉంటుంది. ఎక్కడా కూడా ఎలాంటి మూలలు, రేఖలు ఉండవు. దీనిని ఆకాశం నుంచి చూస్తే ఆస్ట్రోలాబ్ లాగా కనిపిస్తుందని ప్రాజెక్ట్ లీడ్ డిజైనర్ థామస్ వాంగ్ తెలిపాడు. అయితే ఈ మూజియం యొక్క ప్రత్యేకతు ఏంటంటే.. ఖగోళశాస్త్ర విజ్ఞానానికి సంబంధించిన ఎన్నో విశేషాలు ఇక్కడ కనిపిస్తాయి. ఎన్నో ఉల్కల నమూనాలు ఇక్కడ కనిపిస్తాయి.
అంగారక గ్రహానికి సంబంధించి ఎన్నో విశేషాలను తెలుసుకోవచ్చు. గుండ్రంగా ఉన్న ఈ మ్యూజియంలో పర్యాటకులు బరువులేని అనుభూతిని పొందుతారు. అంటే అంతరిక్షంలో ఎలాగైతే జీరో గ్రావిటీ ఉంటుందో ఇక్కడ కూడా బరువును కోల్పోయి ఉంటారు. అంతేకాకుండా ఇక్కడ గాలిలో తేలుతున్న అనుభవం కూడా పొందే అవకాశం ఉంటుంది. అయితే ఈ మ్యూజియం సందర్శకుల కోసం తెరిచిన దగ్గర నుంచి విపరీతంగా సందర్శకులు తాకిడి ఎక్కువ అయింది.
ప్రపంచంలోనే ఎక్కువగా ఖగోళానికి సంబంధించిన విషయాలు ఇక్కడ ఉండటంతో అతి పెద్ద మ్యూజియం ఇదే అని చెబుతున్నారు. ఆకాశంలో జరిగే వింతలకు సంబంధించి ప్రతీ విషయం ఇక్కడ చూసే అవకాశం ఉంటుంది. అలా వాటిని సెట్ చేశారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…