Chiranjeevi – Sridevi : కొడుకు వాడుకుని వదిలేసాడని అతని తండ్రిని పెళ్లి చేసుకోవాలనుకునే విచిత్రమైన కథతో వచ్చిన చిరంజీవి సినిమా ఏంటో తెలుసా..?

పౌరాణిక చిత్రాల పరంపర అప్రతిహతంగా కొనసాగి, ఇక మెల్లిగా సాంఘిక చిత్రాల వైపు తెలుగు పరిశ్రమ మళ్ళింది. 1970 దశకంలో కథానాయకునికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ పాటలు, ఫైట్లతో కథానాయకుడిని అమాంతం ఆకాశానికి ఎత్తేయడంలాంటి సినిమాలు రావడం ప్రారంభమైంది.

Rani Kasula Rangamma : కొడుకు వాడుకుని వదిలేసాడని అతని తండ్రిని పెళ్లి చేసుకోవాలనుకునే విచిత్రమైన కథతో వచ్చిన చిరంజీవి సినిమా ఏంటో తెలుసా..?

ఇక 1980 దశకం ప్రారంభంలో శంకరాభరణం, సర్దార్ పాపారాయుడు, కొండవీటి సింహం, ప్రేమాభిషేకం, ఊరికి మొనగాడు, న్యాయం కావాలి, ఇల్లాలు, బెబ్బులి పులి, జస్టిస్ చౌదరి లాంటి సినిమాల పరంపరలో అప్పుడే సినీపరిశ్రమలోకి కొత్తగా వచ్చిన చిరంజీవి ప్రతి కథానాయకుడిగా కొన్ని చిత్రాల్లో నటించారు. 1981లో టీ.ఎల్ వీ.ప్రసాద్ దర్శకత్వంలో వచ్చిన ‘రాణికాసుల రంగమ్మ’ చిత్రం లో చిరంజీవి, శ్రీదేవి కలిసి నటించారు. సమాజంలో పలుకుబడి ఉన్న జగ్గయ్య ఆగర్భ శ్రీమంతుడు, అతనికి ఒకే ఒక్క కొడుకు చిరంజీవి. తల్లి చిన్నప్పుడే చనిపోవడం వలన అతని గారాబంగా జగ్గయ్య పెంచి పెద్ద చేస్తాడు. కానీ చిరంజీవి జల్సాలకు, విలాసవంతమైన జీవితానికి అలవాటు పడతాడు.

రోజంతా క్లబ్బుల్లో గడుపుతూ రాత్రి అయ్యాక ఇంటికి రావడం లాంటివి చేస్తూ ఉంటాడు. ఆ క్రమంలో ఒక పల్లెటూరుకి చిరంజీవి వెళ్ళినప్పుడు రాణికాసుల రంగమ్మ (శ్రీదేవి) పరిచయమవుతుంది. అమాయకురాలైన రాణికాసుల రంగమ్మ తో పరిచయం పెంచుకుంటాడు. అదును చూసి చిరంజీవి రాణికాసుల రంగమ్మ మోసం చేసి అనుభవిస్తాడు.

ఆ తర్వాత మోసపోయిన శ్రీదేవి, చిరంజీవి చిరునామా తెలుసుకొని ఏకంగా ఆయన ఇంటికి వెళుతుంది. అక్కడ ఆయన తండ్రి గారైన జగ్గయ్యను కలిసి తనకు జరిగిన అన్యాయం గురించి వివరిస్తుంది. అప్పుడు జగ్గయ్య ఆయన ఆఫీసులో ఉద్యోగం కల్పిస్తాడు. కొడుకును పెళ్లి చేసుకోమని ఎంతగా వారించినా చిరంజీవి లైఫ్ ని ఎంజాయ్ చేయాలని పెళ్లిని వాయిదా వేస్తూ ఉంటాడు. ఇలాంటి జల్సా రాయుడు కి ఎలాంటి గుణపాఠం చెప్పాలో తండ్రి జగ్గయ్య ఆ క్రమంలో జగ్గయ్య భార్య లేకపోవడం వలన రాణికాసుల రంగమ్మ ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడతాడు. తన తండ్రి మళ్లీ పెళ్లి చేసుకోవడాన్ని చూసి చిరంజీవి సంతోష పడతాడు. చివరికి తన తండ్రి పెళ్లిచేసుకునేది ఒకప్పుడు తన చేతిలో మోసపోయిన రాణికాసుల రంగమ్మ అని గుర్తించి చిరంజీవి ఆ పెళ్లికి అడ్డుపడతాడు.

తండ్రి ఎందుకు అలా చేస్తున్నావని కొడుకును నిలదీయడంతో.. తాను రాణికాసుల రంగమ్మ ను ఏవిధంగా అన్యాయం చేశానన్న విషయాన్ని తండ్రికి తెలియజేస్తాడు. శ్రీదేవి తనకు జరిగిన అన్యాయం గురించి చెప్పడం, జగ్గయ్య కొడుకు గుణపాఠం రావాలనే రాణికాసుల రంగమ్మను పెళ్లి చేసుకుంటానని నాటకం ఆడానని మంచి మాటలు తెలియజేయడంతో చిరంజీవి మారి శ్రీదేవిని అనగా రాణికాసుల రంగమ్మను పెళ్లి చేసుకుంటాడు. ఇంతటితో సినిమాకి శుభం పడుతుంది.