Raj Tharun: ఎన్నో తెలుగు సినిమాలలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న మధునందన్ అందరికీ సుపరిచితమే. తాజాగా మధునందన్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొని హీరో రాజ్ తరుణ్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా మధునందన్ మాట్లాడుతూ కరోనా సమయంలో ఎదుర్కొన్న సంఘటన గురించి వెల్లడించారు.
కరోనా లాక్ డౌన్ ముందు సమయంలో హీరో రాజ్ తరుణ్ ఫ్యామిలీ మొత్తం గోవా వెళ్లారు. అయితే గోవా వెళ్లిన తర్వాత లాక్ డౌన్ విధించారు. అయితే రాజ్ తరుణ్ ఫ్యామిలీ మొత్తం గోవాలోనే చిక్కుకుపోయారు. ఇంట్లో రాజ్ తరుణ్ ఒక్కడే ఉన్నారు. ఆ సమయంలో కేవలం నిత్యవసర వాహనాలకు మాత్రమే అనుమతి ఉండేది. ఇకపోతే లాక్ డౌన్ కొద్దిరోజులు మాత్రమే ఉంటుంది అనుకుంటే సుమారు కొన్ని నెలల పాటు విధించారు.
ఇక రాజ్ తరుణ్ ఫ్యామిలీ మొత్తం గోవాలో ఉండిపోవడంతో రాజ్ తరుణ్ నాకు ఫోన్ చేసి ఇంట్లో ఎవరు లేరు ఒక్కడినే ఉన్న ఇంకొక వారం ఇలాగే ఉంటే ఖచ్చితంగా నేను సూసైడ్ చేసుకుంటా అంటూ నాకు ఫోన్ చేశారు. అయితే ఒంటరిగా ఉండటం వల్ల బోర్ కొడుతుందన్న ఉద్దేశంతో మాట్లాడారని మధునందన్ తెలిపారు.
ఇక ఆ సమయంలో నా ఫ్రెండ్ కి ఎసెన్సియల్ సర్వీస్ పాస్ ఉంది. దాంతో ప్రతి రోజు ఉదయం కారులో వెళ్లి కొన్ని రకాల పండ్లను ఆ ఏరియాలో ఉన్నటువంటి ట్రాఫిక్ సిగ్నల్ పోలీసులకు అందించే వాళ్ళం. అయితే రాజ్ తరుణ్ ఫోన్ చేయగానే ఏం చేయాలి అని ఆలోచించగా నా ఫ్రెండ్ మాదాపూర్ వెళ్తున్నానని ఫోన్ చేశాడు. ఎలాగో మాదాపూర్ వెళ్తున్నావ్ కదా అలాగే గండిపేట వెళ్లి ఈ అడ్రస్ లో నా ఫ్రెండ్ ఉన్నాడని చెప్పాను.
అక్కడికి వెళ్ళాడు రాజ్ తరుణ్ వచ్చి కారులో కూర్చోగానే ఒకసారిగా నా ఫ్రెండ్ ఆశ్చర్యపోయారు. ఎలాగలాగో రాజ్ తరుణ్ ను మా ఇంటికి తీసుకు వచ్చాము. అయితే మా అపార్ట్మెంట్ లో సుమారు 16 మంది చిన్న పిల్లలు ఉండేవారు వారందరితో రోజు ఆడుకుంటూ ఎంతో ఎంజాయ్ చేశాడు. సుమారు మూడు వారాలపాటు రాజ్ తరుణ్ మా ఇంట్లోనే ఉన్నాడు. అనంతరం లాక్ డౌన్ లో కొంచెం రిలీఫ్ ఇచ్చిన తర్వాత రాజు తరుణ్ కి ఇంటికి వెళ్లాలని లేదని చెప్పారు. ఇక అప్పుడే తన ఫ్యామిలీ గోవా నుంచి రావడంతో రాజ్ తరుణ్ కూడా తన ఇంటికి వెళ్లి పోయారని ఈ సందర్భంగా మధునందన్ కరోనా సమయంలో రాజ్ తరుణ్ విషయంలో జరిగిన సంఘటన గురించి గుర్తు చేసుకున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…