Rashi Khanna: భయంతో ఆ సినిమాకు ఆడిషన్ ఇవ్వకుండా పారిపోయాను… రాశి ఖన్నా కామెంట్స్ వైరల్!

Rashi Khanna: ఊహలు గుసగుసలాడే సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా అడుగుపెట్టిన అందాల ముద్దుగుమ్మ రాశి కన్నా. అవసరాల శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రాశికన్నా తన అందం అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఆ తర్వాత సుప్రీమ్, బెంగాల్ టైగర్, జై లవ కుశ వంటి తెలుగు సినిమాలలో మాత్రమే కాకుండా తమిళ్, మలయాళీ భాషలలో ఎందరో స్టార్ హీరోల సరసన నటించి హీరోయిన్గా మంచి గుర్తింపు పొందింది.

ఇలా హిట్ ప్లాట్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న రాశీ కన్నా స్టార్ హీరోయిన్ గా మాత్రం గుర్తింపు సొంతం చేసుకోలేక పోతోంది. కెరీర్ ఆరంభంలో కొంచం బొద్దుగా కనిపించిన ఈ అమ్మడు ఇప్పుడు కొంచం సన్నబడి నాజూగ్గా తయారైంది.దీంతో తెలుగు, తమిళ్ భాషలలో మాత్రమే కాకుండా బాలీవుడ్ నుండి కూడా అవకాశాలు అందుకుంటుంది.

తాజాగా ఒక వెబ్ సిరీస్ ద్వారా ఈ అమ్మడు బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. ఇక ప్రస్తుతం ఒక హింది రెండు తమిళ్ చిత్రాలలో నటిస్తూ ఈ అమ్మడు బిజీగా ఉంది.
ఇదిలా ఉండగా తాజాగా ఈ అమ్మడి గురించి ఒక వార్త బయటికి వచ్చింది.కెరీర్ ప్రారంభంలో ఒక సినిమాకి ఆడిషన్ ఇవ్వటానికి వచ్చిన రాశి ఖన్నా ఆడిషన్ ఇవ్వకుండానే అక్కడినుండి భయంతో పారిపోయినట్లు తెలుస్తోంది.


Rashi Khanna:నటనపై గౌరవం…


ఊహలు గుసగుసలాడే సినిమా కన్నా ముందు రాసి కన్నా మద్రాస్ కేఫ్ అనే హిందీ సినిమాలో నటించింది. అయితే ఆ సినిమాకి ఆడిషన్ ఇవ్వటానికి వచ్చిన రాశి కన్నా ఆ సమయంలో చాలా మంది సెలబ్రిటీల మధ్య ఆడిషన్ ఇచ్చే ధైర్యం లేక.. వాళ్ళందరిని చూసి పారిపోయిందట. ఆ తర్వాత నటన మీదున్న గౌరవంతో తిరిగి వచ్చి ఆడిషన్ ఇచ్చిందట. అయితే ఆ సినిమాకు రాశీ కన్నా సెలెక్ట్ అయ్యిందనీ తాజాగా ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.