వైరల్ గా మారిన పవన్ కళ్యాణ్ ..రేణు దేశాయ్ రొమాంటిక్ ఫోటో!

ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో తీయని జ్ఞాపకాలు ఉంటాయి. అయితే ఆ జ్ఞాపకాలను అప్పుడప్పుడు నెమరువేసుకుంటూ ఎంతో సంబరపడిపోతూ ఉంటాము.ఈ ఇలాంటి సన్నివేశాలు సాధారణ వ్యక్తుల నుంచి సెలబ్రిటీల వరకూ ప్రతి ఒక్కరి జీవితంలో ఎదురవుతుంటాయి. తాజాగా ఇలాంటి తీపి జ్ఞాపకాన్ని నటి, పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ గుర్తు చేసుకున్నారు.

పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ జంటగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికి తెలిసిందే. అదేవిధంగా పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ ప్రేమకు బీజం పడింది కూడా ఈ సినిమానే ద్వారానే అని చెప్పవచ్చు. ఎంతో విజయం సాధించిన ఈ సినిమా ఏప్రిల్ 20, 2000 సంవత్సరంలో విడుదలయింది.సరిగ్గా ఈ సినిమా విడుదల అయ్యి 21 సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా నటి రేణు దేశాయ్ ఈ సినిమాకి సంబంధించిన కొన్ని జ్ఞాపకాలను పంచుకున్నారు.

బద్రి సినిమాలో యే చికీతా పాట అప్పట్లో ఎంత పాపులర్ అయ్యిందో మనకు తెలిసిందే. అయితే ఈ పాటకు సంబంధించిన ఓ స్టిల్ పోస్ట్ చేసిన రేణు దేశాయ్.. ”చికీతా షూటింగ్ చేస్తుండగా తీసిన పిక్ ఇది. ఇందులో నా దుప్పటా నాకు సన్ స్క్రీన్ నుంచి రక్షణ కల్పించగా.. పవన్ తో బాంబింగ్ ఫొటో” అంటూ తన ఇన్స్టాలో కామెంట్ పెట్టింది.

రేణు దేశాయ్ షేర్ చేసి ఈ ఫోటో చూసిన నెటిజన్లు మరోసారి పవన్ కళ్యాణ్-రేణు దేశాయ్ జోడి ఫోటో పై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ప్రస్తుతం రేణు దేశాయ్ షేర్ ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారి నెటిజన్లను ఆకట్టుకుంది.