Renu Desai: పవన్ ఫ్యాన్స్ ఎఫెక్ట్.. ట్విట్టర్, ఫేస్ బుక్ క్లోజ్ చేసిన రేణు దేశాయ్.. పోస్ట్ వైరల్!

Renu Desai: రేణు దేశాయ్ ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున సోషల్ మీడియా వార్తలలో నిలుస్తున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఎన్నికలలో విజయం సాధించిన తర్వాత ఈమె సోషల్ మీడియా వేదికగా చేసే పోస్టుల వల్ల భారీ స్థాయిలో ట్రోల్స్ ఎదుర్కొంటున్నారు. ఇక ఈమె ఎవరి వల్ల ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

రేణు దేశాయ్ సోషల్ మీడియా వేదికగా ఏదైనా ఒక పోస్ట్ చేసింది అంటే వెంటనే పవన్ కళ్యాణ్ అభిమానులు ఆమెను నెగిటివ్ కామెంట్లతో ట్రోల్ చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అయితే తనని మాత్రమే కాకుండా తన పిల్లలని కూడా ట్రోల్స్ చేస్తున్నారంటూ ఇటీవల ఎంతో ఆవేదన వ్యక్తం చేశారు.

ఇలా తన గురించి తన పిల్లల గురించి సోషల్ మీడియాలో చేసే నెగిటివ్ కామెంట్లు తనని ఎంతో మానసికంగా కృంగదీస్తున్నాయని అందుకే తాను ట్విట్టర్, ఫేస్ బుక్ నుంచి తప్పుకుంటున్నానని వెల్లడించారు. అయితే కొంతమంది నా మంచి కోరే వారి సలహాలు మేరకు ఇంస్టాగ్రామ్ లో మాత్రమే అందుబాటులో ఉంటానని తెలిపారు. ఇక తాను ఇంస్టాగ్రామ్ క్లోజ్ చేయలేనని ఈమె తెలిపారు.

మానసిక క్షోభ..
రేణు దేశాయ్ ఇప్పటికే ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇలా సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్న ఈమె ఇంస్టాగ్రామ్ ద్వారా అందరికీ అందుబాటులో ఉంటున్నారు అందుకే తాను ఇంస్టాగ్రామ్ క్లోజ్ చేయలేనని తెలిపారు. ఏది ఏమైనా నెటిజెన్స్ అలాగే పవన్ అభిమానుల కారణంగా ఈమె ఎంతో మానసిక వేదన అనుభవించడంతోనే ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని తెలుస్తుంది.