Roja: జబర్దస్త్ లోకి రీ ఎంట్రీ ఇచ్చిన రోజా…. సంతోషంలో అభిమానులు!

Roja: బుల్లితెర మీద ప్రసారమవుతున్న కామెడీ షో అనగానే అందరికీ మొదటగా గుర్తొచ్చే పేరు జబర్దస్త్. ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షో గత పది సంవత్సరాలుగా ప్రసారం అవుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ప్రతి గురు శుక్రవారాలలో ప్రసారం అవుతున్న ఈ కామెడీ షో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తుంది. అయితే ఈ షోలో వినిపించి డబుల్ మీనింగ్ డైలాగులు వల్ల కొంతమంది ప్రేక్షకులు ఈ షోని బూతు షో అని విమర్శలు చేస్తున్నప్పటికీ షో రేటింగ్స్ మాత్రం తగ్గటం లేదు.

ఇలా గత పది సంవత్సరాలుగా టాప్ రేటింగ్స్ తో దూసుకుపోతున్న ఈ జబర్దస్త్ కామెడీ షో తొందరలోనే 500 ఎపిసోడ్లు పూర్తి చేసుకోనుంది. 500 వ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో ఇటీవల విడుదల అయింది.
ఇక ఈ స్పెషల్ ఎపిసోడ్ మినిస్టర్ రోజా గెస్ట్ గా హాజరు అయ్యారు. 9 సంవత్సరాల పాటు జబర్దస్త్ కామెడీ షోలో జడ్జిగా వ్యవహరించిన రోజా మంత్రి పదవి దక్కటంతో తన పూర్తి సమయాన్ని ప్రజల సేవకై అంకితం చేయటానికి జబర్దస్త్ కు దూరం అయింది.

9 సంవత్సరాల పాటు జబర్దస్త్ షో కి మంచి రేటింగ్స్ రావటానికి కమెడియన్ల పాత్ర ఎంత ఉందో జడ్జిగా రోజా పాత్ర కూడా ఉంది అని చెప్పడంలో సందేహం లేదు. ఇటీవల విడుదల చేసిన ప్రోమోలో రోజా ఎంట్రీ ఇవ్వడం చూసి ఇంద్రజతో పాటు కృష్ణ భగవాన్ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యారు. కమెడియన్ లందరూ రోజాకే గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. ఈ ఎపిసోడ్ లో రోజా మాట్లాడుతూ..జబర్దస్త్ స్పెషల్ ఎపిసోడ్ కి ఎలా గెస్ట్ గా హాజరు కావడం ఆనందంగా ఉందని రోజా చెప్పుకు వచ్చింది.

Roja: జబర్దస్త్ వేదికపై రోజాకు సన్మానం…

నాతోపాటు హీరోయిన్లుగా చేసిన వారిని ప్రేక్షకులు మర్చిపోయారు. కానీ ఇప్పటికీ ప్రేక్షకులు నన్ను గుర్తు పెట్టుకోవడానికి ముఖ్య కారణం ఈ జబర్దస్త్ అంటూ జబర్దస్త్ గురించి రోజా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. రోజా ఇలా గిఫ్ట్ గా హాజరు కావడంతో తిరిగి ఆమె ఇలా స్టేజ్ మీద చూసినందుకు ఆమె అభిమానులు చాలా సంబరపడుతున్నారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా జబర్దస్త్ టీం రోజాకు ఘనంగా సన్మానం చేశారు.