Featured

Pawan Kalyan: పవన్ ఆవేశం వల్ల సాయి ధరమ్ కెరియర్ నాశనమైంది.. తమ్మారెడ్డి భరద్వాజ్ షాకింగ్ కామెంట్స్!

Pawan Kalyan: ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తెలుగు సినిమా ఇండస్ట్రీకి మధ్య పెద్ద యుద్ధమే జరుగుతుంది. టికెట్ల వ్యవహారం పై రోజు ఏదో ఒక విషయం ద్వారా వార్తల్లో నిలుస్తూ ఉన్నారు.అయితే ఈ సమస్య ఇప్పుడు వచ్చింది కాదని గతంలో నుంచి ఈ సమస్య తెలుగు సినిమా ఇండస్ట్రీనీ వెంటాడుతోందని ఈ సమస్య కోసం కోర్టుకు వెళ్లిన పరిస్థితులు కూడా ఉన్నాయని సీనియర్ నటుడు తమ్మారెడ్డి భరద్వాజ్ ఈ విషయంపై స్పందించారు.

Pawan Kalyan: పవన్ ఆవేశం వల్ల సాయి ధరమ్ కెరియర్ నాశనమైంది.. తమ్మారెడ్డి భరద్వాజ్ షాకింగ్ కామెంట్స్!

ఇలా ఎప్పుడో ఉన్న ఈ సమస్యపై పవన్ కళ్యాణ్ రిపబ్లిక్ సినిమా రిలీజ్ వేడుకలో ప్రస్తావించారు. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ రిపోర్టర్స్,ఏపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన తీరును తమ్మారెడ్డి భరద్వాజ్ పూర్తిగా ఖండించారు. పవన్ కళ్యాణ్ ఆవేశంలో రిపబ్లిక్ సినిమా వేడుకలో మాట్లాడిన మాటలు కారణంగా ఒక మంచి సినిమా చచ్చిపోయింది. సాయి ధరమ్ తేజ్ నటించిన రిపబ్లిక్ సినిమా ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా.

Pawan Kalyan: పవన్ ఆవేశం వల్ల సాయి ధరమ్ కెరియర్ నాశనమైంది.. తమ్మారెడ్డి భరద్వాజ్ షాకింగ్ కామెంట్స్!

ఈ సినిమాకు అద్భుతమైన ఓపెనింగ్స్ రావాల్సి ఉండగా పవన్ కళ్యాణ్ కారణంగా ఈ సినిమా ఓపెనింగ్స్ రాబట్టలేకపోయింది. ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం అత్యధిక శాతం ఓట్లతో గెలుపొందింది. అలా ఓట్లు వేసిన వారిలో కేవలం 10 శాతం మంది ఈ సినిమాని చూడకపోవడం వల్ల ఈ సినిమా ఓపెనింగ్స్ కైవసం చేసుకోలేకపోయిందని తెలిపారు.పవన్ కళ్యాణ్ ఆవేశం కారణంగా ఆయన మాట్లాడిన మాటల వల్ల సాయి ధరమ్ తేజ్ భవిష్యత్తు నాశనం అయిందని తమ్మారెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు.

జనసేన పార్టీ ఆఫీసులో కూర్చుని మాట్లాడుకో…

పవన్ కళ్యాణ్ సినిమాలలోను రాజకీయాల్లోనూ పాల్గొంటున్న విషయం మనకు తెలిసిందే.అయితే ఒక సినిమా వేడుకకు వచ్చినప్పుడు సినిమా గురించి మాట్లాడాలని వైసీపీ నాయకుల గురించి మాట్లాడితే పరిస్థితి ఇలాగే ఉంటుంది. ఆయన మాట్లాడిన మాటల లో సరైన ఉద్దేశం ఉన్నప్పటికీ మాట్లాడాల్సిన సందర్భం అది కాదని తమ్మారెడ్డి వ్యాఖ్యానించారు. వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి.. వారిని తిట్టాలి అనుకుంటే జనసేన పార్టీ ఆఫీసులో కూర్చుని మాట్లాడితే సరిపోతుంది కాని ఇలా సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో మాట్లాడటం వల్ల ఒక కుర్రాడి భవిష్యత్తు నాశనం అయిందని ఆయన షాకింగ్ కామెంట్ చేశారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

“ఇరాన్ అణు కార్యక్రమంపై ఒత్తిడి పెంచుతాం.. అవసరమైతే పరిమిత దాడి: ట్రంప్ హెచ్చరిక”

ఇరాన్ అణు కార్యక్రమం అంశంపై అమెరికా మరోసారి కఠిన స్వరాన్ని వినిపించింది. అమెరికా అధ్యక్షుడు Donald Trump తాజాగా చేసిన…

4 hours ago

“ఒంటరిగా ఉన్నాననే కారణంగా టార్గెట్ చేస్తున్నారు.. కర్మ వదలదు: హీరోయిన్ మీనా భావోద్వేగ వ్యాఖ్యలు”

దక్షిణాదిలో ఒక కాలంలో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన నటీమణుల్లో Meena ప్రత్యేక స్థానం సంపాదించారు. చిన్న వయసులోనే సినిమాల్లోకి అడుగుపెట్టి,…

4 hours ago

“బట్టతలకు బై బై చెప్పే స్మార్ట్ క్యాప్!.. మందులు, సర్జరీ లేకుండానే జుట్టు పెరుగుదల?”

జుట్టు రాలడం ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధిస్తున్న సమస్యగా మారింది. యువత నుంచి మధ్యవయసు వారిదాకా…

4 hours ago

“వీధి కుక్కల బెడద పెరుగుతోంది.. ఉమ్మడి మెదక్‌లో వరుస దాడులతో ప్రజల్లో భయం!”

ఉమ్మడి మెదక్ జిల్లాలో వీధి కుక్కల సమస్య రోజురోజుకీ తీవ్రమవుతోంది. చిన్నారులు, మహిళలు, వృద్ధులు అనే తేడా లేకుండా వరుసగా…

4 hours ago

ఆపరేషన్ చేసి కడుపులో కత్తెర మరిచిపోయిన డాక్టర్లు ! ఐదేళ్లుగా నరకయాతన అనుభవిస్తున్న మహిళ !

ఆస్పత్రి అంటే రోగి ప్రాణాలు కాపాడే స్థలం. కానీ కొన్నిసార్లు అక్కడే జరిగిన నిర్లక్ష్యం బాధితులకు జీవితాంతం మానని గాయాలు…

4 hours ago

విశాఖ సాగరతీరంలో నావికాదళ శక్తి ప్రదర్శన.. బీటింగ్ సెర్మనీతో అబ్బురం!

విశాఖ సాగరతీరంలో ఆదివారం జరిగిన నావికాదళ ప్రదర్శనలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. RK Beach వేదికగా నిర్వహించిన ‘ఆపరేషనల్ డెమో’…

5 hours ago