Featured

Pawan Kalyan: పవన్ ఆవేశం వల్ల సాయి ధరమ్ కెరియర్ నాశనమైంది.. తమ్మారెడ్డి భరద్వాజ్ షాకింగ్ కామెంట్స్!

Pawan Kalyan: ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తెలుగు సినిమా ఇండస్ట్రీకి మధ్య పెద్ద యుద్ధమే జరుగుతుంది. టికెట్ల వ్యవహారం పై రోజు ఏదో ఒక విషయం ద్వారా వార్తల్లో నిలుస్తూ ఉన్నారు.అయితే ఈ సమస్య ఇప్పుడు వచ్చింది కాదని గతంలో నుంచి ఈ సమస్య తెలుగు సినిమా ఇండస్ట్రీనీ వెంటాడుతోందని ఈ సమస్య కోసం కోర్టుకు వెళ్లిన పరిస్థితులు కూడా ఉన్నాయని సీనియర్ నటుడు తమ్మారెడ్డి భరద్వాజ్ ఈ విషయంపై స్పందించారు.

Pawan Kalyan: పవన్ ఆవేశం వల్ల సాయి ధరమ్ కెరియర్ నాశనమైంది.. తమ్మారెడ్డి భరద్వాజ్ షాకింగ్ కామెంట్స్!

ఇలా ఎప్పుడో ఉన్న ఈ సమస్యపై పవన్ కళ్యాణ్ రిపబ్లిక్ సినిమా రిలీజ్ వేడుకలో ప్రస్తావించారు. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ రిపోర్టర్స్,ఏపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన తీరును తమ్మారెడ్డి భరద్వాజ్ పూర్తిగా ఖండించారు. పవన్ కళ్యాణ్ ఆవేశంలో రిపబ్లిక్ సినిమా వేడుకలో మాట్లాడిన మాటలు కారణంగా ఒక మంచి సినిమా చచ్చిపోయింది. సాయి ధరమ్ తేజ్ నటించిన రిపబ్లిక్ సినిమా ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా.

Pawan Kalyan: పవన్ ఆవేశం వల్ల సాయి ధరమ్ కెరియర్ నాశనమైంది.. తమ్మారెడ్డి భరద్వాజ్ షాకింగ్ కామెంట్స్!

ఈ సినిమాకు అద్భుతమైన ఓపెనింగ్స్ రావాల్సి ఉండగా పవన్ కళ్యాణ్ కారణంగా ఈ సినిమా ఓపెనింగ్స్ రాబట్టలేకపోయింది. ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం అత్యధిక శాతం ఓట్లతో గెలుపొందింది. అలా ఓట్లు వేసిన వారిలో కేవలం 10 శాతం మంది ఈ సినిమాని చూడకపోవడం వల్ల ఈ సినిమా ఓపెనింగ్స్ కైవసం చేసుకోలేకపోయిందని తెలిపారు.పవన్ కళ్యాణ్ ఆవేశం కారణంగా ఆయన మాట్లాడిన మాటల వల్ల సాయి ధరమ్ తేజ్ భవిష్యత్తు నాశనం అయిందని తమ్మారెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు.

జనసేన పార్టీ ఆఫీసులో కూర్చుని మాట్లాడుకో…

పవన్ కళ్యాణ్ సినిమాలలోను రాజకీయాల్లోనూ పాల్గొంటున్న విషయం మనకు తెలిసిందే.అయితే ఒక సినిమా వేడుకకు వచ్చినప్పుడు సినిమా గురించి మాట్లాడాలని వైసీపీ నాయకుల గురించి మాట్లాడితే పరిస్థితి ఇలాగే ఉంటుంది. ఆయన మాట్లాడిన మాటల లో సరైన ఉద్దేశం ఉన్నప్పటికీ మాట్లాడాల్సిన సందర్భం అది కాదని తమ్మారెడ్డి వ్యాఖ్యానించారు. వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి.. వారిని తిట్టాలి అనుకుంటే జనసేన పార్టీ ఆఫీసులో కూర్చుని మాట్లాడితే సరిపోతుంది కాని ఇలా సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో మాట్లాడటం వల్ల ఒక కుర్రాడి భవిష్యత్తు నాశనం అయిందని ఆయన షాకింగ్ కామెంట్ చేశారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

నా మాటలను వక్రీకరించారు.. ప్రకాశ్ రాజ్ క్లారిటీ

సినీ నటుడు ప్రకాశ్ రాజ్ ఇటీవల తన వ్యాఖ్యలపై చెలరేగిన వివాదానికి స్పందిస్తూ కీలక వివరణ ఇచ్చారు. రామాయణం, హిందూ…

13 hours ago

డాక్టర్ సలహా లేకుండా మందులు ఆపితే… మీ ఆరోగ్యానికి రిస్క్

ఇటీవలి కాలంలో బరువు తగ్గడం, షుగర్ నియంత్రణ కోసం వాడుతున్న GLP-1 తరహా మందులపై చర్చ పెరుగుతోంది. వైద్యుల సలహాతో…

1 day ago

కొబ్బరి చట్నీ కేవలం రుచే కాదు… ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో తెలుసుకోండి!

ఉదయపు అల్పాహారంలో ఇడ్లీ, దోసె, ఉప్మా వంటి వంటకాలకు తోడు తప్పనిసరిగా కనిపించే వంటకం కొబ్బరి చట్నీ. సాధారణంగా రుచికోసం…

1 day ago

వేసవిలో విత్తనాలు తింటున్నారా? చియా నుంచి అవిసె వరకు… వేసవిలో ఎలా తినాలి? తెలియకపోతే రిస్క్!

వేసవి మొదలవుతూనే ఆహారంలో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం, నీటి కొరత రాకుండా జాగ్రత్తపడటం ఈ…

1 day ago

బయట బాగుంటుంది… లోపల ఖాళీ! సరైన కొబ్బరికాయను ఎలా ఎంచుకోవాలి?

కొబ్బరికాయ కొనడం చాలా సాధారణమైన పని అనిపించినా, చాలా సార్లు అది మనకు నిరాశ కలిగిస్తుంది. బయట నుంచి బాగానే…

1 day ago

ఆరోగ్యానికి అల్ఫాల్ఫా గింజలు ఉపయోగమా? తీసుకునే ముందు తెలుసుకోవాల్సిన విషయాలు

ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ సహజమైన ఆహారాలపై ప్రజల దృష్టి మరింతగా పడుతోంది. అలాంటి వాటిలో “అల్ఫాల్ఫా” అనే మొక్క,…

1 day ago