Pawan Kalyan: పవన్ ఆవేశం వల్ల సాయి ధరమ్ కెరియర్ నాశనమైంది.. తమ్మారెడ్డి భరద్వాజ్ షాకింగ్ కామెంట్స్!
Pawan Kalyan: ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తెలుగు సినిమా ఇండస్ట్రీకి మధ్య పెద్ద యుద్ధమే జరుగుతుంది. టికెట్ల వ్యవహారం పై రోజు ఏదో ఒక విషయం ద్వారా వార్తల్లో నిలుస్తూ ఉన్నారు.అయితే ఈ సమస్య ఇప్పుడు వచ్చింది కాదని గతంలో నుంచి ఈ సమస్య తెలుగు సినిమా ఇండస్ట్రీనీ వెంటాడుతోందని ఈ సమస్య కోసం కోర్టుకు వెళ్లిన పరిస్థితులు కూడా ఉన్నాయని సీనియర్ నటుడు తమ్మారెడ్డి భరద్వాజ్ ఈ విషయంపై స్పందించారు.
ఇలా ఎప్పుడో ఉన్న ఈ సమస్యపై పవన్ కళ్యాణ్ రిపబ్లిక్ సినిమా రిలీజ్ వేడుకలో ప్రస్తావించారు. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ రిపోర్టర్స్,ఏపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన తీరును తమ్మారెడ్డి భరద్వాజ్ పూర్తిగా ఖండించారు. పవన్ కళ్యాణ్ ఆవేశంలో రిపబ్లిక్ సినిమా వేడుకలో మాట్లాడిన మాటలు కారణంగా ఒక మంచి సినిమా చచ్చిపోయింది. సాయి ధరమ్ తేజ్ నటించిన రిపబ్లిక్ సినిమా ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా.
ఈ సినిమాకు అద్భుతమైన ఓపెనింగ్స్ రావాల్సి ఉండగా పవన్ కళ్యాణ్ కారణంగా ఈ సినిమా ఓపెనింగ్స్ రాబట్టలేకపోయింది. ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం అత్యధిక శాతం ఓట్లతో గెలుపొందింది. అలా ఓట్లు వేసిన వారిలో కేవలం 10 శాతం మంది ఈ సినిమాని చూడకపోవడం వల్ల ఈ సినిమా ఓపెనింగ్స్ కైవసం చేసుకోలేకపోయిందని తెలిపారు.పవన్ కళ్యాణ్ ఆవేశం కారణంగా ఆయన మాట్లాడిన మాటల వల్ల సాయి ధరమ్ తేజ్ భవిష్యత్తు నాశనం అయిందని తమ్మారెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు.
పవన్ కళ్యాణ్ సినిమాలలోను రాజకీయాల్లోనూ పాల్గొంటున్న విషయం మనకు తెలిసిందే.అయితే ఒక సినిమా వేడుకకు వచ్చినప్పుడు సినిమా గురించి మాట్లాడాలని వైసీపీ నాయకుల గురించి మాట్లాడితే పరిస్థితి ఇలాగే ఉంటుంది. ఆయన మాట్లాడిన మాటల లో సరైన ఉద్దేశం ఉన్నప్పటికీ మాట్లాడాల్సిన సందర్భం అది కాదని తమ్మారెడ్డి వ్యాఖ్యానించారు. వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి.. వారిని తిట్టాలి అనుకుంటే జనసేన పార్టీ ఆఫీసులో కూర్చుని మాట్లాడితే సరిపోతుంది కాని ఇలా సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో మాట్లాడటం వల్ల ఒక కుర్రాడి భవిష్యత్తు నాశనం అయిందని ఆయన షాకింగ్ కామెంట్ చేశారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…