Pawan Kalyan: ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తెలుగు సినిమా ఇండస్ట్రీకి మధ్య పెద్ద యుద్ధమే జరుగుతుంది. టికెట్ల వ్యవహారం పై రోజు ఏదో ఒక విషయం ద్వారా వార్తల్లో నిలుస్తూ ఉన్నారు.అయితే ఈ సమస్య ఇప్పుడు వచ్చింది కాదని గతంలో నుంచి ఈ సమస్య తెలుగు సినిమా ఇండస్ట్రీనీ వెంటాడుతోందని ఈ సమస్య కోసం కోర్టుకు వెళ్లిన పరిస్థితులు కూడా ఉన్నాయని సీనియర్ నటుడు తమ్మారెడ్డి భరద్వాజ్ ఈ విషయంపై స్పందించారు.

ఇలా ఎప్పుడో ఉన్న ఈ సమస్యపై పవన్ కళ్యాణ్ రిపబ్లిక్ సినిమా రిలీజ్ వేడుకలో ప్రస్తావించారు. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ రిపోర్టర్స్,ఏపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన తీరును తమ్మారెడ్డి భరద్వాజ్ పూర్తిగా ఖండించారు. పవన్ కళ్యాణ్ ఆవేశంలో రిపబ్లిక్ సినిమా వేడుకలో మాట్లాడిన మాటలు కారణంగా ఒక మంచి సినిమా చచ్చిపోయింది. సాయి ధరమ్ తేజ్ నటించిన రిపబ్లిక్ సినిమా ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా.

ఈ సినిమాకు అద్భుతమైన ఓపెనింగ్స్ రావాల్సి ఉండగా పవన్ కళ్యాణ్ కారణంగా ఈ సినిమా ఓపెనింగ్స్ రాబట్టలేకపోయింది. ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం అత్యధిక శాతం ఓట్లతో గెలుపొందింది. అలా ఓట్లు వేసిన వారిలో కేవలం 10 శాతం మంది ఈ సినిమాని చూడకపోవడం వల్ల ఈ సినిమా ఓపెనింగ్స్ కైవసం చేసుకోలేకపోయిందని తెలిపారు.పవన్ కళ్యాణ్ ఆవేశం కారణంగా ఆయన మాట్లాడిన మాటల వల్ల సాయి ధరమ్ తేజ్ భవిష్యత్తు నాశనం అయిందని తమ్మారెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు.
జనసేన పార్టీ ఆఫీసులో కూర్చుని మాట్లాడుకో…
పవన్ కళ్యాణ్ సినిమాలలోను రాజకీయాల్లోనూ పాల్గొంటున్న విషయం మనకు తెలిసిందే.అయితే ఒక సినిమా వేడుకకు వచ్చినప్పుడు సినిమా గురించి మాట్లాడాలని వైసీపీ నాయకుల గురించి మాట్లాడితే పరిస్థితి ఇలాగే ఉంటుంది. ఆయన మాట్లాడిన మాటల లో సరైన ఉద్దేశం ఉన్నప్పటికీ మాట్లాడాల్సిన సందర్భం అది కాదని తమ్మారెడ్డి వ్యాఖ్యానించారు. వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి.. వారిని తిట్టాలి అనుకుంటే జనసేన పార్టీ ఆఫీసులో కూర్చుని మాట్లాడితే సరిపోతుంది కాని ఇలా సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో మాట్లాడటం వల్ల ఒక కుర్రాడి భవిష్యత్తు నాశనం అయిందని ఆయన షాకింగ్ కామెంట్ చేశారు.

































