ఇకపై అలాంటి పాత్రలలో నటించడానికి సై అంటున్న సాయి పల్లవి!

తెలుగు సినీ ప్రేక్షకులకు హీరోయిన్ సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈమె తెలుగులో తక్కువ సినిమాలే చేసినప్పటికీ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పరుచుకుంది సాయి పల్లవి. ఫిదా సినిమాతో తనకంటూ ప్రత్యేకమైన ఫాలోయింగ్ సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. ఈసినిమా తర్వాత విడుదలైన ఎంసిఏ కూడా హిట్ కావడంతో స్టార్ అయిపోయింది. అయితే ఆ తర్వాత వచ్చిన కణం, పడిపడి లేచే మనసు, ఎన్జీకే, మారి 2 లాంటి సినిమాలలో నటించింది.

ఈ సినిమాలు అన్ని ఇలా వచ్చి అలా వెళ్లిపోవడంతో తెలుగులో సాయి పల్లవి ఇమేజ్‌ను బాగానే దెబ్బ తీసాయి.అయితే సినిమాలు ఫ్లాప్ అయినా కూడా ఈ అమ్మడు క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ఈ ముద్దుగుమ్మ ఈ మధ్యకాలంలో నటిస్తున్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ లుగా నిలుస్తుండటంతో ఈమెకు భారీగా డిమాండ్ ఏర్పడింది.

ఇటీవలే నాగ చైతన్య, సాయి పల్లవి కాంబినేషన్ లో వచ్చిన లవ్ స్టోరీ సినిమా అదిరిపోయే సక్సెస్ ను అందుకోవడంతో, తన ఖాతాలోకి మరొక హిట్ ను చేర్చుకుంది. అయితే ఇప్పటివరకు కేవలం సెలక్టివ్ గా ఉండే తన పాత్రకు ప్రాధాన్యత ఉన్న సినిమాలు మాత్రమే చేస్తూ వచ్చిన సాయి పల్లవి ప్రస్తుతం తన నిర్ణయాన్ని మార్చుకున్నట్టు ఉ తెలుస్తోంది. రాబోయే రోజుల్లో ఫలానా జోనర్ పాత్రలకే పరిమితం కాకుండా విభిన్న పాత్రల్లో నటించేందుకు ఈ అమ్మడు రెడీ అవుతున్నట్లు సినీ వర్గాల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ఇప్పటికే కామెడీ ఓరియెంటెడ్ పాత్రలు మెసేజ్ చేస్తాను అని చెప్పిన సాయి పల్లవి అలాంటి ఒక మంచి ప్రాజెక్ట్ తగిలితే కచ్చితంగా నటిస్తాను అంటోంది. మరి నిజంగానే సాయి పల్లవి కామెడీ రొమాంటిక్ సినిమాల్లో నటిస్తే ఆమె ఎలా ప్రేక్షకులను మెప్పిస్తుందా అనే ఊహాగానాలు ప్రస్తుతం వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియాలి అంటే వేచి చూడాల్సిందే మరి.