స్టేజ్ పైనే ఏడ్చేసిన సాయిపల్లవి..! కారణం ఏంటో తెలుసా.. !

సాయిపల్లవి నటనతో పాటు తన డ్యాన్సింగ్ తో అభిమానులను సంపాదించుకుంది. ముఖ్యంగా తన వ్యక్తిత్వంతో చాలా మందిని ఆకట్టుకుంది. ఎన్ని కోట్లు ఇచ్చినా కూడా కొన్ని యాడ్స్ లో నటించలేదు. తాజాగా నాని, సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్న సెబాస్టియన్ ముఖ్య పాత్రధారులుగా రాహుల్ సాంకృత్యాన్ డైరెక్షన్ లో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న సినిమా శ్యాంసింగరాయ్.

ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచానాలు నెలకొన్నాయి. కలకత్తా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోంది శ్యాంసింగరాయ్. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ అభిమానుల్లో అంచనాలు పెంచేసింది. తాజాగా హైదరాబాద్ లో శ్యాంసింగరయ్  ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు చిత్ర యూనిట్.

అయితే ఈ కార్యక్రమంలో సాయి పల్లవి మాట్లాడుతూ.. కంటతడి పెట్టుకుంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. సినిమా గురించి, డైరెక్టర్ రాహుల్ గురించి సాయిపల్లవి మాట్లాడుతున్న సమయంలో అభిమానులు పెద్ద ఎత్తున అరిచారు. దీంతో అభిమానులు ప్రేమను తట్టుకోలేని సాయిపల్లవి ఎమోషన్ అవుతూ.. స్టేజ్ పై ఏడ్చేసింది.

సాధారణంగా హీరోలు మాట్లాడుతున్నప్పడు మాత్రమే అభిమానంతో అరిచే అభిమానులను చూస్తుంటాం. అయితే ఒక హీరోయిన్ మాట్లాడే సమయంలో ఫ్యాన్స్ ఇంతలా రచ్చ చేయడం చాలా అరుదని అంటున్నారు. దీన్ని బట్టి తెలుస్తోంది తెలుగులో సాయిపల్లవి క్రేజ్. ఈ సినిమాలో సాయిపల్లవిల్ల దేవదాసిగా కనిపించనుంది. క్రిస్మ స్ కానుకగా డిసెంబరు 24న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.