Samantha – Naga Chaitanya: నన్ను క్షమించండి.. సమంత తల్లి ముందు కన్నీళ్లు పెట్టుకున్న చైతు..

Samantha – Naga Chaitanya: సమంత, నాగచైతన్య వ్యవహారం ఒడవని ముచ్చటగా మారిపోయింది. ఎక్కడ చూసినా.. ప్రతీ రోజు ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో తెగర వైరల్ అవుతుంటాయి. వాళ్లు విడాకులు తీసుకొని దాదాపు మూడు నెలలు పూర్తి అయింది. అధికారికంగా వారిద్దరు ప్రకటించుకున్నారు కనుక ఎవరి దారి వాళ్లు చూసుకున్నారు.

Samantha - Naga Chaitanya: నన్ను క్షమించండి.. సమంత తల్లి ముందు కన్నీళ్లు పెట్టుకున్న చైతు..

కానీ చట్ట ప్రకారం మాత్రం వాళ్లకు ఇంకా విడాకుల పత్రాలు మాత్రం రాలేదు. ఇదిలా ఉండగా.. సమంత, నాగచైతన్యల విషయానికి వస్తే నాగచైతన్య సున్నితమైన మనస్తత్వం కలవాడు. ఎవరినీ నొప్పించడు. ఏం జరిగినా తనలో తానే కుమిలిపోతుంటాడు. విడాకుల ప్రకటన తర్వాతా అతడు దాదాపు మూడు వారాల పాటు.. ఇంట్లోనే ఉండి..ఎంతో కుమిలిపోయినట్లుగా తెలుస్తోంది.

ఆ మూడు వారాలు మీడియా ముందుకు కూడా రాలేదు. అయితే ప్రస్తుతం నాగచైతన్య, సమంత మళ్లీ ఒకటవుతారనే వార్తలు వస్తున్నాయి. ఎలా అంటే దీనికి ఒక ఘటన చోటు చేసుకున్నట్లు సోషల్ మీడియలో ఓ వార్త హల్ చల్ చేస్తోంది. ఇటీవల చైతూ..విడాకులు తీసకున్నందుకు సారీ ఆంటీ అంటూ.. సమంత తల్లికి ఫోన్ చేసి కన్నీళ్లు పెట్టుకున్నాడట.

సమంత తల్లి చైతూను.. ఒక కొడుకులాగే ట్రీట్ చేసేదట. అందుకే అత్తకు ఫోన్ చేసి విడాకుల విషయం చెప్పి.. క్షమాపణలు కోరాడని తెలుస్తోంది. ఒక వేళ సమంత మళ్లీ వస్తే.. కలిసేందుకు నాగచైతన్య ఓకె చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఇది ఎంత వరకు నిజమో తెలియదు కానీ.. సోషల్ మీడియాలో మాత్రం ఇలాంటి వార్తలు గుప్పుమంటున్నాయి.

ఆ విషయం అభిమానులకు పెద్ద షాక్..

అయితే ఇది నిజం కాకుండా ఉండటానికే ఎక్కువగా అవకాశం ఉంది.. ఎందుకంటే.. సమంతపై నాగచైతన్యకు ఇప్పటికే ప్రేమ అంతా చచ్చిపోయింది. విడాకులు తీసుకున్న తర్వాత సమంత కూడా.. కాస్త స్కిన్ షో ఉన్న సినిమాలు చేయడం మొదలు పెట్టింది. దీంతో అతడికి ఆమెపై ఉన్న ఆ కాస్త ప్రేమ కూడా పోయిందనేది తెలుస్తోంది. కనుక ఇలా చర్చించుకోవడం అనేది వృదా అన్నట్లుగా ఫ్యామిలీ సన్నిహితులు అంటున్నారు. ఏదేమైనా సమంత, నాగచైతన్య విడాకుల ప్రస్తావన చాలామంది అభిమానులకు షాక్ ఇచ్చింది.