Bigg Boss Season 6: బిగ్ బాస్ సీజన్ 6 కంటెస్టెంట్లు వీళ్లే.. సోషల్ మీడియాలో వైరల్!
Bigg Boss Season 6: తెలుగు బుల్లితెరపై ప్రసారం అయ్యే రియాల్టీ షోల్లో ఎక్కువగా బిగ్ బాస్ కు ఉన్న క్రేజ్ మరే షోకు ఉండదు. అందులోకి వెళ్లి పార్టిసిపేట్ చేసిన ప్రతీ ఒక్కరూ బయటకు వచ్చిన తర్వాత విపరీతంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంటారు. ఇలా ప్రతీ సీజన్లో కూడా జరిగింది.
తెలుగులో మొత్తం ఇప్పటి వరకు ఐదు సీజన్లను పూర్తి చేసుకుంది. ఈ ఐదు సీజన్ల వరకు స్టార్ మాలో ప్రసారం చేశారు. కానీ ఈ సారి ప్రసారం అయ్యే సీజన్ 6 కు సంబంధించి మొదటి నుంచి అనుకున్నట్లే.. ఓటీటీలో ప్రసారం చేయనున్నారని.
మొదటి సీజన్ లో ఎన్టీఆర్ హోస్ట్ చేయగా.. రెండో సీజన్ కు నానీ.. మూడో సీజన్ నుంచి వరుసగా మూడు సీజన్లకు నాగార్జున హోస్ట్ గా చేసి.. బెస్ట్ హోస్టర్ గా పేరు తెచ్చుకున్నారు. అయితే సీజన్ 6కు మొదట బాలయ్య అనుకున్నా.. దానికి నాగార్జున స్వయంగా సమాధానం చెప్పాడు. సీజన్ 6 కు కూడా తానే హోస్ట్ గా వ్యవహరిస్తానన్నాడు. దీంతో ఆ పుకార్లకు ఫుల్ స్టాప్ పడింది.
ఇక సీజన్ 5లో 19 మంది కంటెస్టెంట్లు హౌస్ లోకి అడుగు పెట్టారు. సీజన్ 6లో అంతమంది ఉండకపోవచ్చనేది తెలుస్తోంది. ఇక అందులో పాల్గొనే కంటెస్టెంట్ల పేర్లు కొన్ని వినిపిస్తున్నాయి. ఈ పేర్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సీజన్ 6లో పాల్గొనేవారు ఎవరంటే.. మొదటగా ప్రముఖంగా వినిపిస్తున్న పేర్లలో.. యాంకర్ వర్షిణి, యాంకర్ శివ, డ్యాన్స్ షో ‘ఢీ-10’ విజేత రాజు, టిక్టాక్ స్టార్ దుర్గారావు, ‘సాఫ్ట్వేర్ డెవలపర్స్’వెబ్ సిరీస్ ఫేమ్ వైష్ణవి, సోషల్ మీడియా స్టార్ వరంగల్ వందన, యాంకర్ ప్రత్యూష. వీళ్ల పేర్లు ప్రస్తుతం ఫైనల్ అయ్యాయని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.
తెలుగు బుల్లితెరపై ప్రసారమైన ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన పండు మాస్టర్, తన డ్యాన్స్…
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘మా ఇంటి బంగారం’ విడుదలకు సిద్ధమైంది. గత…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా బ్యూటీ రంగంలో అత్యంత ఎక్కువగా వినిపిస్తున్న పదాల్లో "కొరియన్ స్కిన్కేర్" ఒకటి. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికలపై…
తమిళ సినీ పరిశ్రమలో నటుడు, దర్శకుడు, కొరియోగ్రాఫర్గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రాఘవ లారెన్స్ ఇప్పుడు రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నట్లు ప్రకటించడం…
హైదరాబాద్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు మరోసారి పెరగడంతో కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారు. గత కొద్ది రోజులుగా తగ్గుదల దిశగా…
కాకినాడ జిల్లాలోని తుని మండలం సీహెచ్ అగ్రహారంలో అదృశ్యమైన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి కేసు రోజురోజుకూ మరింత ఉత్కంఠ రేపుతోంది.…