Samantha: అనారోగ్యం తర్వాత మొదటిసారి బయటకు వచ్చిన సమంత.. ఆరోగ్యం పై స్పందిస్తూ కన్నీళ్లు పెట్టిన నటి!

Samantha: సమంత గత కొద్ది రోజులుగా సోషల్ మీడియా వార్తల్లో పెద్ద ఎత్తున నిలుస్తున్నారు.ఈమె గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతుంది అంటే సోషల్ మీడియాలో వార్తల రావడంతో ఈ వార్తలపై సమంత స్పందిస్తూ తాను మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్నానని సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. ఈ వ్యాధి కారణంగా తాను ఒక అడుగు కూడా ముందుకు వేయలేకపోతున్నాననీ తాను ఆ వ్యాధితో పోరాటం చేస్తున్నానని చెప్పుకొచ్చారు.

ఈ విధంగా సమంత అనారోగ్యం గురించి ఎంతోమంది స్పందిస్తూ తాను క్షేమంగా కోలుకోవాలని కోరుకున్నారు. ఇకపోతే సమంత నటించిన పాన్ ఇండియా చిత్రం యశోద సినిమా నవంబర్ 11వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్లకు కూడా సమంత దూరంగా ఉన్నారు. అయితే తాజాగా యాంకర్ సుమతో కలిసి ఒక రికార్డు ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి సమంత ఈ ఇంటర్వ్యూలో భాగంగా తన అనారోగ్యం గురించి వస్తున్న వార్తలపై స్పందిస్తూ కన్నీళ్లు పెట్టుకున్నారు.

తాను భయంకరమైన వ్యాధితోనే పోరాడుతున్నానని అయితే ఈ వ్యాధితో యుద్ధం చేసే చివరికి తానే గెలుస్తానని ఈమె ధీమా వ్యక్తం చేశారు. అయితే తన జీవితంలో ఎన్నో మంచి రోజులు చెడు రోజులు వచ్చాయి. ఒక అడుగు ముందుకు కూడా వేయలేకపోతున్నాననే భావన నుంచి తాను జీవితంలో చాలా వరకు ముందుకు వచ్చానని చెబుతూ ఎమోషనల్ అయ్యారు.

Samantha: నేనింకా బ్రతికే ఉన్నా…


ఇకపోతే నా అనారోగ్యం గురించి చాలామంది ఎన్నో రకాల వార్తలు రాశారు. కొన్నిసార్లు ఆ వార్తలు చూసినప్పుడు బాదేస్తుందనీ, వాటి గురించి తాను పట్టించుకోనని తెలిపారు.సమంత ప్రస్తుతం చావు బతుకుల మధ్య ఉందన్నట్టు వార్తలు రాశారు. ప్రస్తుతానికి నేను బతికే ఉన్నానని ఇంకా చచ్చిపోలేదని ఈమె ఈ ఇంటర్వ్యూ సందర్భంగా తన అనారోగ్య పరిస్థితి గురించి గుర్తుచేసుకొని కన్నీళ్లు పెట్టుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.