Sameera Reddy: బేబీ బంప్ తో నీటి అడుగున సమీరా రెడ్డి వింత ఫోటోషూట్.. వైరల్ అవుతున్న ఫోటోలు !

Sameera Reddy: నటి సమీరా రెడ్డి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. బి గోపాల్ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన నరసింహుడు అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతో ప్రేక్షకులను పెద్దగా సందడి చేయలేకపోయింది.ఇక ఈ సినిమా పెద్దగా ఫలితాన్ని అందుకోలేకపోయిన ఈమె నటనతో ప్రేక్షకులను బాగా సందడి చేసింది.

ఈ సినిమా అనంతరం మెగాస్టార్ చిరంజీవి సరసన జై చిరంజీవ అనంతరం ఎన్టీఆర్ సరసన అశోక్ వంటి సినిమాలలో నటించి సందడి చేశారు.ఇలా పలు తెలుగు సినిమాలలో నటించినప్పటికీ ఈమెకు సరైన గుర్తింపు రాకపోవడంతో పూర్తిగా తెలుగు తెరకు దూరమయ్యారు. ఇకపోతే 2014లో నటి సమీరా రెడ్డి అక్షయ్ వర్దేని అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలో స్థిరపడ్డారు.

ఇకపోతే ఈమె 2019వ సంవత్సరంలో రెండోసారి గర్భం దాల్చగా ఆ సమయంలో ఒక వింత ఫోటోషూట్ చేయించుకుంది.ఈ క్రమంలోనే ఆ ఫోటోషూట్ కి సంబంధించిన ఫోటోలను చాలా ఆలస్యంగా సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఈ ఫోటోలు క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. ఇది చూసిన పలువురు ఇలా కూడా ఫోటో షూట్ చేయించుకుంటారా అంటూ ఆశ్చర్యపోతున్నారు.

Sameera Reddy: బిడ్డను మోస్తూ ఆనందంగా ఉన్నాను….

ఈమె తన బేబీ బంప్ తో ఏకంగా నీటి అడుగున సాహసాలు చేస్తూ ఫోటోషూట్ చేయించుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడమే కాకుండా ఈ ఫోటోలను షేర్ చేస్తూ… గర్భంలో బేబీ చిత్రం అందమైన శరీరాన్ని కలిగి ఉన్నానంటూ పోస్ట్ చేశారు. ఇలా నా బిడ్డను మోస్తూ ఉన్నప్పుడు చాలా ఆనందంగా ఉన్నాను అంటూ ఈ ఫోటోలను షేర్ చేశారు. ఈ విధంగా ఈమె షేర్ చేసిన ఫోటోలు ప్రస్తుతం నెట్ ఇంట్లో చక్కర్లు కొడుతున్నాయి.