భర్తతో తన మాజీ ప్రియురాలు సంతోషంగా లేదని.. అతడు ఎంత పనిచేశాడో తెలుసా..!

దాదాపు నెల రోజుల క్రితం వాళ్లిద్దరు పెళ్లి చేసుకున్నారు. కానీ ఆమెకు అంతక ముందే మరో వ్యక్తితో సంబంధం ఉంది. ఈ క్రమంలో ఆమె భర్తను దారుణంగా కాల్చి చంపారు. ఆమె మాజీ ప్రియుడే ఈ హత్య చేశాడని పోలీసులు తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్ లోని ఉన్నావోలోని ఓ పాఠశాలలో ప్రీతి, హేమేంద్రలు పని చేస్తున్నారు.

ఈ పాఠశాలలోనే పని చేసే సునీల్ అనే ఉపాధ్యాయుడు.. హేమేంద్రకు స్నేహితుడు. అయితే ప్రతీ, హేమేంద్రల పరిచయం ప్రేమగా మారింది. మూడు సంవత్సరాల తర్వాత అంటే.. ఈ ఏడాది జనవరిలో.. ఎటవాహ్‌లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు అతడు బదిలీ అయ్యాడు.

మరో వైపు ప్రతీ సింగ్ జూలైలో లక్నోలోని డయాగ్నొస్టిక్ సెంటర్‌లో పీఆర్‌వోగా పనిచేస్తున్న హర్దోయికి చెందిన అశుతోష్‌ సింగ్‌ను పెళ్లి చేసుకుంది. అతడికి ఇద్దరు సోదరులు ఉన్నారు. వాళ్లతో కలిసి లక్నోలోని మహర్షి నగర్ లో నివాసం ఉంటున్నాడు. అయితే ఆగస్టు 24న అశుతోష్ ను సర్వీస్ రోడ్డుపై ఎవరో కాల్చి చంపేశారు.

చనిపోక ముందు అతడికి బిజినెస్ గురించి మాట్లాడాలని.. హేమేంద్ర అతడి స్నేహితుడు సునీల్ అతడికి ఫోన్ చేసి కలిశారు. ఆ తర్వాత అతడిని కాల్చి చంపేశారు. ఘటనా స్థలానికి చేరిన పోలీసులు ఫోన్ నంబర్ ఆధారంగా నిందితుడిని పట్టుకోగా.. ప్రతీని ప్రేమిస్తున్నట్లు చెప్పాడు. ప్రీతి అతడితో సంతోషంగా లేదని తన స్నేహితుడు సునీల్ కు చెబుతూ ఉండేదని.. అన్నారు. దీంతో తాము అతడిని అంతం చేయాలనే ఆలోచనతో ఇలా ప్లాన్ చేసి చంపేసినట్లు తెలిపారు. దీంతో ప్రీతిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ముగ్గురుని అరెస్టు చేశారు.