అన్ని బంధాలకంటే.. పేగు బంధం గొప్పది అంటారు పెద్దలు. వివాహేతర సంబంధాల వల్ల ఇలాంటి బంధాలు కూడా మట్టిలో కలిసిపోతున్నాయి. పెళ్లి అనే బంధానికి కూడా మాయని మచ్చ తెస్తున్నారు. పరాయి మహిళ లేదా పురుషుడి మోజులో పడి కుటుంబాలను నాశనం చేసుకుంటున్నారు. ఇలాంటిదే ఓ ఇల్లాలు వివాహేతర సంబంధం పెట్టుకొని తన పిల్లలపైనే ప్రతాపం చూపిస్తోంది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడు విల్లిపురం జిల్లాకు చెందిన సత్యమంగళం గ్రామానికి చెందిన వడివేలన్, తులసి దంపతులు. వీరికి రెండు సంవత్సరాలు, నాలుగు సంవత్సరాల ఇద్దరు మగ బిడ్డలు ఉన్నారు. అయితే గత కొంత కాలంగా ఈ దంపతుల మధ్య గొడవలు మొదలయ్యాయి.
భర్త మీద కోపం ఆమె పిల్లలపై చూపించేది. ఎప్పుడు గొడవ జరిగినా వాళ్లను కొట్టడమే కాకుండా.. వీడియోలు తీసి తన భర్తకు పంపించడం అలవాటు చేసుకుంది. ఇలా ఓరోజు తన కొడుకులను 250 సార్లు కొట్టినట్టుగా తన భర్తకు వీడియో పంపింది. దీంతో అతడు తన భార్య వేధింపులకు విసిగి పోయాడు. లాభం లేదని వెళ్లి పోలీసులకు ఈ వీడియో చూపించాడు.
ఆమెకు ఓ ప్రియుడు ఉన్నాడని.. అందుకే రోజు తమ మధ్య గొడవలు మొదలయ్యేయని.. దానికి ప్రతీ కారంగా పిల్లలను చిత్రహింసలకు గురిచేస్తుందని చెప్పాడు. దీనిపై పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసుకోగా.. ఆమె పరారీలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆమె తమిళనాడు బోర్డర్ దాటి చిత్తూరుకు వెళ్లినట్లు సమాచారం.
కర్ణాటక రాష్ట్రంలోని బెళగావి జిల్లాలో చోటుచేసుకున్న ఒక దారుణ ఘటన కుటుంబాల్లో పెరుగుతున్న అసహనం ఎంత ప్రమాదకరంగా మారుతుందో మరోసారి…
సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ తన కొత్త పాడ్కాస్ట్లో మరోసారి తనదైన స్టైల్లో ఆలోచింపజేసే విషయాలను ప్రస్తావించారు. ‘సైన్స్ అండ్…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్లోనే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ లగ్జరీకి ప్రాధాన్యత ఇస్తున్నట్లు మరోసారి రుజువైంది. ఇప్పటికే…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూశారు. 90 ఏళ్ల వయసులో ఆయన బుధవారం ఉదయం తుదిశ్వాస…
తెలుగు సినీ పరిశ్రమపై ఎప్పుడూ ముక్కుసూటిగా మాట్లాడే నటుడు జేడీ చక్రవర్తి తాజాగా మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు.…
సినిమా రంగంలో నటీనటుల కష్టాలు, అంకితభావం గురించి తరచూ వినిపిస్తుంటుంది. అయితే కొంతమంది స్టార్ హీరోయిన్లు తమ పనిపై చూపించే…