ఏ దేశంలో అయినా ప్రభుత్వానికి ఆదాయం అనేది వివిధ రకాల పన్నుల ద్వారానే వస్తుంది. వాటి ద్వారానే వివిధ రకాల సంక్షేమ పథకాలను ప్రవేశపెడతారు. అది ఆదాయపు పన్ను కావచ్చు.. కార్పొరేషన్ ట్యాక్స్ కావచ్చు.. ఇంకా ఏదైనా ట్యాక్స్ కావచ్చు. ఆదాయానికి మించి ఎవరికైనా అదనపు ఆదాయం ఉంటే ఆదాయపు పన్ను చెల్లించాలి.
అయితే ప్రస్తుతం మన దేశంలో చాలా వరకు పన్నులకు జీఎస్టీ రూపంలో వసూలు చేస్తోంది. ఇలా ఆదాయపు పన్ను చెల్లించలేదని ఓ సెలెబ్రెటీపై చైనా ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. దాదాపు రూ.340 కోట్లు కట్టాలని సమన్లు కూడా జారీ చేసింది. ఆ పన్ను కట్టే వరకు ఎలాంటి షోలకు, సినిమాలకు వెళ్లే హక్కు లేదంటూ ఆదేశాలు కూడా జారీ చేసింది. ఆమె పేరు జెంగ్ షువాంగ్.
చైనాలో అతి పెద్ద సెలబ్రిటీ. ఈమె గత రెండు సంవత్సరాల్లో సినిమాలు, టీవీ సరీస్ ల కోసం తీసుకున్న పేమెంట్ కు సంబంధించి పన్ను కట్టలేదని షాంఘై మున్సిపల్ ట్యాక్స్ సర్వీస్ గుర్తించింది. అంతకముందే ఆమెకు ఛాన్స్ ఇచ్చి చూశారు. అయినా ఆమె పన్ను కట్టకపోవడంతో పలు సినిమాల్లో నటించేందుకు నిషేధం విధించడంతో పాటు.. జరిమానా కూడా విధించారు.
చైనా ప్రభుత్వం పన్నులను వసూలు చేసే విషయంలా కఠినంగా వ్యవహరిస్తోంది. దీనికి రాజకీయ నాయకులు, సెటబ్రిటీలు ఎవరూ అతీతులు కాదంటూ పేర్కొంది. మన దేశంలో కూడా పన్ను ఎగవేతదారులపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…