ఏ దేశంలో అయినా ప్రభుత్వానికి ఆదాయం అనేది వివిధ రకాల పన్నుల ద్వారానే వస్తుంది. వాటి ద్వారానే వివిధ రకాల సంక్షేమ పథకాలను ప్రవేశపెడతారు. అది ఆదాయపు పన్ను కావచ్చు.. కార్పొరేషన్ ట్యాక్స్ కావచ్చు.. ఇంకా ఏదైనా ట్యాక్స్ కావచ్చు. ఆదాయానికి మించి ఎవరికైనా అదనపు ఆదాయం ఉంటే ఆదాయపు పన్ను చెల్లించాలి.
అయితే ప్రస్తుతం మన దేశంలో చాలా వరకు పన్నులకు జీఎస్టీ రూపంలో వసూలు చేస్తోంది. ఇలా ఆదాయపు పన్ను చెల్లించలేదని ఓ సెలెబ్రెటీపై చైనా ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. దాదాపు రూ.340 కోట్లు కట్టాలని సమన్లు కూడా జారీ చేసింది. ఆ పన్ను కట్టే వరకు ఎలాంటి షోలకు, సినిమాలకు వెళ్లే హక్కు లేదంటూ ఆదేశాలు కూడా జారీ చేసింది. ఆమె పేరు జెంగ్ షువాంగ్.
చైనాలో అతి పెద్ద సెలబ్రిటీ. ఈమె గత రెండు సంవత్సరాల్లో సినిమాలు, టీవీ సరీస్ ల కోసం తీసుకున్న పేమెంట్ కు సంబంధించి పన్ను కట్టలేదని షాంఘై మున్సిపల్ ట్యాక్స్ సర్వీస్ గుర్తించింది. అంతకముందే ఆమెకు ఛాన్స్ ఇచ్చి చూశారు. అయినా ఆమె పన్ను కట్టకపోవడంతో పలు సినిమాల్లో నటించేందుకు నిషేధం విధించడంతో పాటు.. జరిమానా కూడా విధించారు.
చైనా ప్రభుత్వం పన్నులను వసూలు చేసే విషయంలా కఠినంగా వ్యవహరిస్తోంది. దీనికి రాజకీయ నాయకులు, సెటబ్రిటీలు ఎవరూ అతీతులు కాదంటూ పేర్కొంది. మన దేశంలో కూడా పన్ను ఎగవేతదారులపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే.
శ్రీకాళహస్తి దేవస్థానంలో రాహు-కేతు పూజల టికెట్ ధరల పెంపుపై చెలరేగిన వివాదానికి చివరకు ముగింపు పడింది. భక్తుల నుంచి వచ్చిన…
తెలుగు సినీ పరిశ్రమలో ఒకప్పుడు హీరోయిన్గా మంచి గుర్తింపు పొందిన ఆమని ఇప్పటికీ అదే ఉత్సాహంతో, ఆరోగ్యంతో కనిపించడం చాలా…
కర్ణాటక రాష్ట్రంలోని బెళగావి జిల్లాలో చోటుచేసుకున్న ఒక దారుణ ఘటన కుటుంబాల్లో పెరుగుతున్న అసహనం ఎంత ప్రమాదకరంగా మారుతుందో మరోసారి…
సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ తన కొత్త పాడ్కాస్ట్లో మరోసారి తనదైన స్టైల్లో ఆలోచింపజేసే విషయాలను ప్రస్తావించారు. ‘సైన్స్ అండ్…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్లోనే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ లగ్జరీకి ప్రాధాన్యత ఇస్తున్నట్లు మరోసారి రుజువైంది. ఇప్పటికే…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూశారు. 90 ఏళ్ల వయసులో ఆయన బుధవారం ఉదయం తుదిశ్వాస…