జ్వరం రావడం అనేది సర్వ సాధారణం. ఎవరికైనా వస్తుంది. అయితే అటువంటి సందర్భంలో చాలామంది వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకుంటాం. లేదంటే.. ఒక పారాసిటమాల్ టాబ్లెట్ వేసుకొని నయం చేసుకుంటాం. ఇలా మెడిసిన్ వాడి దాని బారి నుంచి రక్షించుకుంటాం. అయితే ఇలా కాకుండా కొన్ని పద్ధతుల ద్వారా కూడా జ్వరాన్ని తగ్గించుకోవచ్చు.
అవేంటో ఎక్కడ చూద్దాం.. మానవ శరీరం సాధారణ ఉష్టోగ్రత అనేది సాధారణంగా 98.4 ఫారెన్ హీట్ లేదా 37 డిగ్రీల వరకు ఉంటుంది. దీని కంటే ఎక్కువ అయితే జ్వరం వచ్చినట్లుగా గ్రహిస్తాం. వైద్యులు అందుబాటలో ఉంటే వెంటనే సంప్రదించడం మంచిది.. అలాంటి సౌకర్యం లేని వారికి ఇప్పుడు చేప్పేది ఒక ప్రథమ చికిత్స లాంటిది.
ఓ గిన్నెలో నీళ్లను తీసుకొని అందులో 200 గ్రాముల పెసరపప్పు పోయాలి. 20 నిమిషాల వరకు నానబెట్టి ఆ తర్వాత వాటిని వడగట్టి.. ఆ నీటిని మరో గిన్నెలో తీసుకోవాలి. దానిని జ్వరం తగిలిన వ్యక్తి తాగిస్తే ఉపశమనం కలుగుతుంది.
ఆ తర్వాత ఆ పేషెంట్ కు ఇడ్లీ తినిపిస్తే నీరసం కూడా తగ్గుతుంది. ఇది కేవలం అప్పటికప్పడు చేపట్టే ప్రథమ చికిత్స మాత్రమే.. అంతిమంగా వైద్యులను సంప్రదించి.. వారు సూచించిన ట్యాబ్లెట్లను వేసుకోవాలి. పెసరపప్పుకు మన శరీరాన్ని చల్లబరిచే గుణం ఉంటుంది. అందులో విటమిన్ బి, సి, మాంగనీస్ ఎక్కువగా ఉంటాయి. అవి ఏ పదర్థాన్ని అయినా చల్లబర్చుతుంది. దాని వల్ల జ్వరం తగ్గి శరీర ఉష్టోగ్రత సమతాస్థితికి చేరుతుంది.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…