జ్వరం రావడం అనేది సర్వ సాధారణం. ఎవరికైనా వస్తుంది. అయితే అటువంటి సందర్భంలో చాలామంది వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకుంటాం. లేదంటే.. ఒక పారాసిటమాల్ టాబ్లెట్ వేసుకొని నయం చేసుకుంటాం. ఇలా మెడిసిన్ వాడి దాని బారి నుంచి రక్షించుకుంటాం. అయితే ఇలా కాకుండా కొన్ని పద్ధతుల ద్వారా కూడా జ్వరాన్ని తగ్గించుకోవచ్చు.

అవేంటో ఎక్కడ చూద్దాం.. మానవ శరీరం సాధారణ ఉష్టోగ్రత అనేది సాధారణంగా 98.4 ఫారెన్ హీట్ లేదా 37 డిగ్రీల వరకు ఉంటుంది. దీని కంటే ఎక్కువ అయితే జ్వరం వచ్చినట్లుగా గ్రహిస్తాం. వైద్యులు అందుబాటలో ఉంటే వెంటనే సంప్రదించడం మంచిది.. అలాంటి సౌకర్యం లేని వారికి ఇప్పుడు చేప్పేది ఒక ప్రథమ చికిత్స లాంటిది.
ఓ గిన్నెలో నీళ్లను తీసుకొని అందులో 200 గ్రాముల పెసరపప్పు పోయాలి. 20 నిమిషాల వరకు నానబెట్టి ఆ తర్వాత వాటిని వడగట్టి.. ఆ నీటిని మరో గిన్నెలో తీసుకోవాలి. దానిని జ్వరం తగిలిన వ్యక్తి తాగిస్తే ఉపశమనం కలుగుతుంది.
ఆ తర్వాత ఆ పేషెంట్ కు ఇడ్లీ తినిపిస్తే నీరసం కూడా తగ్గుతుంది. ఇది కేవలం అప్పటికప్పడు చేపట్టే ప్రథమ చికిత్స మాత్రమే.. అంతిమంగా వైద్యులను సంప్రదించి.. వారు సూచించిన ట్యాబ్లెట్లను వేసుకోవాలి. పెసరపప్పుకు మన శరీరాన్ని చల్లబరిచే గుణం ఉంటుంది. అందులో విటమిన్ బి, సి, మాంగనీస్ ఎక్కువగా ఉంటాయి. అవి ఏ పదర్థాన్ని అయినా చల్లబర్చుతుంది. దాని వల్ల జ్వరం తగ్గి శరీర ఉష్టోగ్రత సమతాస్థితికి చేరుతుంది.
































