ఒంగోలులో పోకూరి బాబూరావు డిగ్రీ మొదటి సంవత్సరంలో మొదటిరోజు కళాశాలలోకి ప్రవేశించాడు. సాధారణంగా మొదటి రోజు కాబట్టి పోకూరి బాబూరావు పెద్ద కాలర్ తో ఉన్న ఎర్ర చొక్కా వేసుకొని కళాశాలలోకి ప్రవేశించాడు. తనకంటే సీనియర్ అయిన టి.కృష్ణ విద్యార్థి సంఘం నాయకుడిగా ఉన్నారు. వామపక్ష భావజాలం ఉన్న టి.కృష్ణ ఎర్ర చొక్కాలో కనిపించిన బాబురావును చూసి స్నేహపూర్వకంగా దగ్గరికి తీశాడు. ఇక అప్పటి నుంచి టి.కృష్ణ పోకూరి బాబూరావు మధ్య స్నేహం చిగురించింది. టి.కృష్ణ ఒకవైపు చదువుకుంటూ.. నాటికలు వేస్తూ.. కళాశాలలో మొదటి బహుమతులు పొందేవాడు.
ఆ క్రమంలో పోకూరి బాబురావు చేత కూడా నాటకాల్లో పాత్రలు వేయించడం, అలాగే కళాశాల వార్షికోత్సవంలో అతనిచే పాటలు పాడించడం లాంటివి టి. కృష్ణ చేసేవాడు. నాటికలు, నాటకాల్లో అనుభవమున్న టి.కృష్ణ ఎలాగైనా సినిమాల్లోకి వెళ్లాలని ఆలోచన వచ్చింది. ఆ క్రమంలో ఆయన మద్రాసు వెళ్లారు. ప్రముఖ దర్శకుని దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా టి.కృష్ణ చేరాడు. కానీ సినిమా అవకాశాలు పెద్దగా దొరకలేదు.
అయితే తామే సొంతంగా ఓ సినిమా తీద్దామని టి.కృష్ణ, పోకూరి బాబూరావు అనుకున్నారు. ఒంగోలులో ఒకే కళాశాలలో చదువుకున్న టి.కృష్ణ (బీకాం ఫైనల్ ఇయర్) పి.బాబురావు (బీకాం ఫస్ట్ ఇయర్) చిరంజీవి (ఇంటర్మీడియట్..) మద్రాసులో ఒక రోజు “మన ఊరి పాండవులు” చిత్రం చూసిన టి.కృష్ణ, బాబురావు, ఆ సినిమాలో నటించిన చిరంజీవిని మన కళాశాలలో చూసానని కృష్ణ చెప్పడంతో.. చిరంజీవి గురించి వాకబు చేస్తే నిజంగానే ఒంగోలులో తమ జూనియర్ గా చదివాడని తెలిసింది.
అయితే చిరంజీవి హీరోగా.. మహాత్మా గాంధీ చెప్పిన చెడు అనకు, చెడు వినకు, చెడు కనకు అనే మాటకు రివర్స్ లో ఓ సినిమా చేద్దామని అనుకున్నారు. ఆ క్రమంలో కథ మెల్లి మెల్లిగా.. తయారు చేయడం మొదలు పెట్టారు. ఈ క్రమంలో చిరంజీవి తన సినీ పరంపరలో భాగంగా, అభిలాష, ఆరని మంటలు వంటి విజయవంతమైన సినిమాలో నటిస్తూ.. 1983లో ఏకంగా “ఖైదీ” అనే ఇండస్ట్రీ హిట్ సినిమాతో వారికి అందనంత ఎత్తుకు ఎదిగి పోయాడని టి.కృష్ణ, పోకూరి బాబూరావు తయారు చేసుకున్న “చెడు అను, చెడు విను, చెడు కను” సినిమా కథని మధ్యలోనే విరమించుకున్నారు. ఆ తరువాత మరో కొత్త కథతో ఈతరం ఫిలిమ్స్, టి.కృష్ణ దర్శకత్వంలో “నేటి భారతం’ చిత్రం రూపొందించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. ఆ తర్వాత రోజుల్లో కూడా ఈతరం ఫిలిమ్స్ బ్యానర్ లో చిరంజీవి తో ఒక్క సినిమా కూడా రాక పోవడం గమనార్హం.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…