Senior Journalist Imandhi Ramarao : ఎన్టీఆర్ నాణెం విడుదల నీకు గర్వకారణం కాదా…రాజకియం ఎందుకు చేస్తున్నావ్… : సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామారావు

Senior Journalist Imandhi Ramarao : సీనియర్ ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని కేంద్రం చొరవతో నందమూరి కుటుంబం వంద రూపాయల ఎన్టీఆర్ ముఖ చిత్రం గల నాణెం ను విడుదల చేసారు. రాష్ట్రపతి ద్రౌపది మూర్ము చేతుల మీదుగా వెండి నాణెం విడుదల కార్యక్రమం జరుగగా నందమూరి వారసులు అలాగే టీడీపీ ప్రముఖులు పలువురు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆయన భార్య గా నన్ను పిలవాల్సిన బాధ్యత లేదా అంటూ లక్ష్మి పార్వతి మీడియా ముందు ఎన్టీఆర్ గారి కూతురు పురందేశ్వరి అలాగే చంద్రబాబు నాయుడు గారి మీద విరుచుకుపడిన సంగతి తెలిసిందే. ఇక ఈ ఇష్యూ మీద ఇమంది రామారావు మాట్లాడారు.

ఆయనకు అంతటి గౌరవం వస్తే రాజకియం ఎందుకు….

సీనియర్ ఎన్టీఆర్ గారు మాజీ ముఖ్యమంత్రి అలాగే సినిమా హీరోగా తెలుగు జాతి ఖ్యాతిని పెంచిన శక పురుషుడు. ఆయన సేవలకు గుర్తుగా కేంద్ర ప్రభుత్వం వంద రూపాయల నాణెం విడుదల చేస్తే అందుకు గర్వపడాలి కానీ ఇలా నన్ను పిలవలేదు ఆయన భార్యను నేను అంటూ నానాయాగి చేయడం మీడియా ముందు నీ పరువు నువ్వు తీసుకుంటున్నావ్ అంటూ లక్ష్మి పార్వతి గురించి ఇమంది గారు అభిప్రాయపడ్డారు.

ఆయన జీవితం మొత్తం నువ్వు ఉన్నట్లుగా వ్యవహారిస్తూ ఆయన పరువు తీస్తూ అలానే నీ పరువు తీసుకుంటున్నావ్ అంటూ ఆమె గురించి మాట్లాడారు. ఆయన మరణంతోనే నీకు ఆయన కుటుంబానికి ఉన్న బంధం తెగి పోయింది. వారికి నీకు ఎటువంటి సంబంధం లేదు. ఎన్టీఆర్ గారికి వ్యతిరేకం అయిన పార్టీలోనే చేరి ఆయన కుటుంబాన్ని తిడుతున్న నిన్ను వారు ఎలా పిలుస్తారు కుటుంబం అని ఎలా భావిస్తారు అంటూ ఇమంది అభిప్రాయపడ్డారు.